ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియానికి సీజ్ ప్రమాదం పోంచి వుంది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే ఇలాంటి హెచ్చరికలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేక పర్యాయాలు ఇలాంటి హెచ్చరికలు జారీ అయినా.. ఈ సారి మాత్రం చాలా పకడ్భంధీగానే హెచ్చరికలు జారీ కావడంతో.. హెచ్ సీ ఎ అధికారులు ఈ తటపటాయిస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలు జారీ చేసిందెవరు..? వారికి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియానికి సంబంధమేమిటి అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ ఉదయించకమానవు.
ఇళ్లు, భవనాలకు చెందిన ఆస్తి పన్నులు చెల్లించని పక్షంలో నోటీసులు జారీ చేసే అధికారులు.. మౌలిక వసుతులను కట్ చేసి మరీ పన్నును వసూలు చేస్తుంటారు. కానీ సుదీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించకుండా ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై ఇన్నాళ్లు మీన మేషాలు లెక్కించిన ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) అధికారులు.. ఐపీఎల్ మ్యాచుల నేపథ్యంలో ఎలాగైనా వసూలు చేయాలని గట్టి చర్యలకు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు వున్న నేపథ్యంలో.. శనివారం బాకీ చెల్లించని పక్షంలో సాయంత్రం స్టేడియాన్ని సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తు ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే హెచ్సీఏ తమకు రూ. 12 కోట్ల భారీ మొత్తంలో ఆస్తి పన్ను బాకీ ఉందని.. ఈ నేపథ్యంలోనే తమకు మరో గత్యంతరం లేక ఇలా చేస్తున్నామని ‘ఐలా’ వెల్లడించింది.
పన్ను చెల్లించకుండా హెచ్సీఏ తాత్సారం చేస్తోందని అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 10, 15, 17 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. గత శనివారం తొలి మ్యాచ్కు ముందే ‘ఐలా’ స్టేడియం సీజ్ చేసేందుకు యత్నించగా, హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్తో చర్చల అనంతరం మరికొంత గడువు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. శనివారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే స్టేడియంను సీజ్ చేస్తామని ‘ఐలా’ ప్రతినిధులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, ఐలా అధికారులు స్టేడియం వద్దకు చేరుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more