ఐపీఎల్-8 సీజన్ మొదలైన తొలిరోజుల్లో రాజస్థాన్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో వరుసగా 5 విజయాలను నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాకు సంబంధించిన ధీటైన ఆటగాళ్లతోపాటు ప్రతిభగల ఇండియన్ ప్లేయర్స్ ఈ జట్టులో వుండటంతో ఈ జట్టు బాగానే ప్రదర్శించగలిగింది. అయితే.. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ.. ఏవిధంగా మొదటి 5 విజయాలు నమోదు చేసుకుందో.. అదేవిధంగా 5 పరాజయాలను చవిచూసింది. ఈ దెబ్బతో ఈ జట్టు పనైపోయిందని అనుకున్నారు కానీ.. ఆదివారం ముంబైలో జరిగిన మ్యాచ్ లో తన సత్తా చాటింది. ఢిల్లీ మీద తన ప్రతాపం చూపించి.. ఈ జట్టు మళ్లీ తన అగ్రస్థానాన్ని పొందింది.
ముంబై స్టేడియంలో జరిగిన మ్యాచులో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుపై రాజస్థాన్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు.. ప్రత్యర్థి ఆటగాళ్లను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన అజింక్యా రహానే (91) చివరిదాకా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ వాట్సన్ (21) ఔటైన తర్వాత బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన కరుణ్ నాయర్ (61) కూడా బ్యాట్ ఝుళిపించాడు. రహానే, నాయర్ వీరవిహారంతో రాయల్స్ స్కోరు పరుగులు పెట్టింది. ఢిల్లీ బౌలర్లు వీరిని నిలువరించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఇక 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 175 పరుగులు చేసి పరాజయం పాలయ్యింది. డుమీని (56) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా.. అత్యధిక ఖరీదైన ఆటగాడు యువరాజ్ (22) మాత్రం చాలా దారుణమైన ప్రదర్శనతో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లందరూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. రాయల్స్ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో ఢిల్లీ జట్టు కుదేలయ్యింది. రాయల్స్ బౌలర్ల ధాటికి ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంలో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకెళ్లింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more