పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై 16 ఏళ్ల ప్రతీకారాన్ని తీర్చుకుంది పసికూన బంగ్లాదేశ్. పసికూన అనగానే క్రికెట్ అని అర్ధమైయ్యింది కదూ.. గత పదహారు ఏళ్లుగా ఏ క్రికెట్ లోనూ పాకిస్థాన్ ను ఓడించని బంగ్లాదేశ్.. తొలిసారిగా సోంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో దాయాధులను మట్టికరింపించింది. బంగ్లా పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ తో ఇవాళ జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో అతిథ్య జట్టు 79 పరుగులతో విజయాన్ని సాధించింది. బంగ్లా రాజధాని ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన ఆసక్తికర పోరులో నెగ్గిన బంగ్లా ఈ అరుదైన విజయాన్ని పదహారేళ్ల తరువాత పాకిస్థాన్ పై సాధించింది.
1999 ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా పాకిస్థాన్ ను ఓడించిన బంగ్లా.. ఆ తరువాత మళ్లీ 16 ఏళ్లకు ఇవాళ జరిగిన తొలి వన్డేలో పాక్ పై గెలిచింది. మూడు వన్డేల సీరీస్ లో పాక్ పై 1-0తో అదిక్యంలో కోనసాగుతోంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత యాభై ఓవర్లలో అత్యధ్భుత ఆటతీరుతో రాణించి 329 పరుగులు సాధించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, సహా ముషాఫిర్ రహీమ్ సెంచరీలతో రాణించడంతో అతిథ్య జట్టు పటిష్ట స్థాయికి చేరింది. తమీమ్ ఇక్బాల్ 15 ఫోర్లు, మూడు సిక్స్ లతో 132 పరుగులు సాధించగా, ముసాఫిర్ రహీమ్ రెండు సిక్స్ లు పదమూడు ఫోర్లతో 106 పరుగులు సాధించారు. వీరిద్దరి మధ్య మూడో విక్కెట్ కు 178 పరుగుల బాగస్వామ్యం నమోదైంది.
వరల్డ్ కప్ లో పాక్ జట్టుకు సారథ్యం వహించిన మిస్బా వుల్ హక్, సీనియర్ ఆటగాడు షాహీద్ అఫ్రీదీలు విరమణ ప్రకటించడంతో వారు లేకుండా బంగ్లాదేశ్ నిర్ధేశించిన భారీ స్కోరును చేధించడంలో బరిలో దిగిన పాకిస్థాన్ జట్టు చతికిల పడింది. అజార్ అలి, హరీస్, మహమ్మద్ రిజ్వాన్ లు రాణించినా.. మిగిలిన ఆటగాళ్లు రాణించలేక చతికిల పడటంతో పాకిస్థాన్ ఇంకా నాలుగు ఓవర్ల నాలుగు బంతులు మిగిలి వుండగానే చాపచుట్టేసింది. బంగ్లా పేస్ బౌలర్ తస్కీన్ అహ్మద్, స్పిన్నర్ అరాఫత్ సన్నీ లు చెరో మూడు విక్కట్లు తీశారు
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more