మా బంధం దృఢమైంది అంటూ టీవీ యాడ్ లా తెగ వాయించేస్తున్నారు విరాట్ కోహ్లీ. ఎవరు విడదీయాలనుకున్నా మా బంధం విడిపోదని క్రికెటర్ కోహ్లీ గట్టిగా చెబుతున్నాడు. బాలీవుడ్ భామ అనుష్క శర్మతో ఉన్న రిలేషన్ పై స్పందిస్తూ కుర్రాడు ఈ కామెంట్లు చేశాడు. అంతేకాదు ఆ రోజే మా బంధం మరింత బలపడిందంటున్నాడు. ఇంతకీ ఏ రోజు బాబూ అంటే… వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. దీనంతటికి అనుష్కశర్మే కారణమని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమ్మడి ఫోటోలను తగులబెట్టారు. సోషల్ సైట్లో కూడా అనుష్కను తిట్టిపోశారు. ఈ సంఘటన కుర్రాడి మనసును గాయపరిచిందట. తన భాగస్వామిని తిట్టిపోసినందుకు చాలా బాధపడ్డాడట. ఆ బాధే మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచిందంటున్నాడు కోహ్లీ. ఆ రోజున తనపై విమర్శలు వస్తున్నాపట్టించుకోకుండా తనకు అండగా నిలిచిందని అప్పుడే అనుష్క మనసు పూర్తిగా అర్థం చేసుకోగలిగానని చెప్పుకొచ్చాడు కోహ్లీ.
కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగి ఆడి టీమ్ ను గెలిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ తన మనసులోని ఆవేదనంతా బయటపెట్టాడు. అనుష్క తన పార్ట్ నర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె పెవిలియన్ లో ఉంటే తనకు కొండంత బలం వస్తుందంటున్నాడు. అసలు తన సక్సెస్ సీక్రెట్ అమ్మడేనంటున్నాడు. ఆమె వెంట ఉంటే ఏ టెన్షన్ ఉండదంటున్నాడు. ఇక పెవిలియన్ లో కూర్చొని చిరునవ్వులు చిందిస్తే… ఆ ఊపుతో సెంచరీలు బాదేస్తానని.. అసలు టెస్ట్ క్రికెట్ లో వరసగా నాలుగు సెంచరీలు చేయటానికి కారణం అదేనంటూ అసలు రహస్యం చెప్పాడు. అంతేకాదు క్రికెటే నా జీవితం. నా శక్తి ఉన్నంతవరకు టీమిండియా గెలుపు కోసం ఆడతాను. అదేవిధంగా అనుష్కతో నా బంధాన్ని విడదీయాలనుకున్నా అదీ కుదరని పని అని స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బస్సులో కోహ్లీతో కలిసి ప్రయాణం చేసిన అమ్మడు త్వరలోనే జీవిత ప్రయాణాన్ని స్టాట్ చేస్తుందని సన్నిహితులు చెబుతున్నానారు. మరి ఇంతలా మనసులు కలిసిన వీరు ఎప్పటికి తమ లైఫ్ జర్నీని స్టార్ట్ చేస్తారో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more