ఇటీవలికాలంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు పెల్లుబికుతున్నాయి. ముఖ్యంగా మొన్న ముగిసిన 2015-వరల్డ్ కప్ సందర్భంగా ఐసీసీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇండియా క్రికెట్ జట్టుతో ఐసీసీ కుమ్మక్కై ఆ దేశానికే ఎక్కువే ప్రాధాన్యతనిస్తోందంటూ ఎందరో అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా మాజీ ఐసీసీ అధ్యక్షుడు ఇహసాన్ మణి ఆందోళన వ్యక్తం చేశారు.
మొదట ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కల్గిన క్రికెట్ భవిష్యత్తుపై మణి జోస్యం చెప్పారు. ప్రస్తుత క్రికెట్ లో ఆరోగ్యకరమైన పరిస్థితులు సన్నగిల్లుతున్నాయని.. గత క్రికెట్ కు, ఇప్పటి క్రికెట్ కు చాలా వ్యత్యాసాలు వచ్చాసాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతరోజుల్లో క్రికెట్ అనేది వ్యాపారపరంగా మారుతోందన్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన ప్రపంచ గవర్నింగ్ సమాఖ్య తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా మణి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వరల్డ్ కప్(2019)నాటికి టెస్ట్ హోదా కల్గిన పది జట్లే ఉంటాయన్న ఐసీసీ నిర్ణయంపై మణి తీవ్రంగా మండిపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రికెట్ జట్లు వుండగా.. 10 జట్లతోనే వరల్డ్ కప్ నిర్వహిస్తామని ఐసీసీ పేర్కోవడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. వ్యాపారపరంగా మారుతున్న ఈ ప్రపంచ క్రికెట్.. ప్రధానంగా మూడు దేశాల అధీనంలోనే నడుస్తోందన్నారు. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా ఈ మూడు జట్లు ఐసీసీని శాసిస్తున్నాయన్నారు. చాలా జట్లు ఆర్థికంగా తగిన బలంగా లేక చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయన్ని గుర్తించాలని ఆయన తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more