ప్రపంచ కప్ టోర్నమెంటులో గ్రూప్ భిలో వెస్టీండీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా నాలుగు విక్కెట్లతో విజయాన్ని నమోదు చేసుకుంది. విండీస్ విసిరిన 183 పరుగల లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా ఆటగాళ్లు తడబాటుకు గురైనా ఎట్టకేలకు చానాళ్ల తరువాత ఫామ్ లోకి వచ్చిన కెప్టెన్ దోణి ఆచితూచి ఆడుతూ విండీస్ పై విజయాన్ని నమోదు చేశాడు.. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ ఓపనెర్లు విలవిలలాడారు. 20 పరుగుల వద్ద రెండు విక్కట్లు జారవిడుచుకున్నారు. విండీస్ తో పెర్త్ లో జరుగిన మ్యాచ్ లో ధోణి సేన 11 పరుగులకే తొలి విక్కెట్ ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 9 పరుగల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తరువాత రోహిత్ శర్మ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఓపెనర్లు ఇద్దరూ 20 పరుగలకే పెవీలియన్ దారి పట్టారు.
ఆ తరువాత వచ్చిన విరాట్ కోహ్లీ.. అజ్యింక రహానేలు కొద్ది సేపు నిలకడగా ఆడి భారత్ స్కోరును 60 పరుగుల వద్దకు చేర్చారు. ఆచితూచి ఆడుతున్న సమయంలో షాట్ బాల్ ను పుల్ చేసి కొట్టడంలో విఫలం చెందిన కోహ్లీ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వెనువెంటనే అజ్యింక రహానే కూడా ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన సురేష్ రైనా కూడా పెవీలియన్ దారి పట్టాడు. ఆ తరువాత వచ్చిన జెడేజా కొద్ది సేపు ఆచితూచి ఆడినా.. ఆ తరువాత హుక్ షాట్ కొట్టేందుకు యత్నించి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్ 30 ఓవర్లలో 135 పరుగులు సాధించడానికి శ్రమించింది. క్రీజ్ లో వున్న సారధి మహేంద్ర సింగ్ ధోని.. అశ్విన్ నిదానంగా రాణించారు. విక్కెట్ ను జారవిడుచుకోకుండా అచితూచి ఆడారు. 64 బాల్ లలో 51 పరుగుల భాగస్వామ్యంతో భారత్ కు మరో విజయాన్ని అందించారు. కేవలం 39.1 ఓవర్లలోనే భారత్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ధోణి 45 పరుగులను సాధించగా, అశ్విన్ 16 పరుగులు సాధించాడు. భారత్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 33 పరుగులు, సురేష్ రైనా 22 పరుగులు సాధించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్.. టీమిండియా బౌలర్ల ధాటికి కుప్పకూలింది. టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు క్రమంగా పెవీలియన్ చేరుతుండటంతో విండీస్ కేవలం 182 పరుగలకే అలౌట్ అయ్యింది. నిర్ణీత 50 ఓవర్లలో 44.2 ఓవర్లలోనే చాపటుట్టేసింది. భారత్ కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్టెన్ హోల్డర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. గేల్ 21, కార్టర్ 21, సామీ 26, టేలర్ 11 పరుగులు చేశారు. రామదిన్ డకౌటయ్యాడు. స్మిత్(6), శ్యామ్యూల్స్(2), సిమ్సన్(9), రసెల్(8) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, ఉమేష్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లు తీశారు. అశ్విన్, మొహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more