వన్డే క్రికెట్, టీ 20 క్రికెట్ ఫార్మెట్ లలో స్టంప్స్ కు తో వికెట్ కీపర్లు చేసే అవుట్ లకు ఒక్కోసారి థర్డ్ ఎంపైర్ కూడా ఢిపెన్స్ లో పడి బ్యాట్స్ మెన్ ఫేవర్ గా తీర్పును వెలువరిస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వచ్చిన స్టంప్స్ తో ఎంపైర్, లెట్ ఎంపర్లు చకచకా నిర్ణయాలను వెల్లడిస్తున్నారు. ఎందకంటారా అవి ఎఈఢీ స్టంప్స్ కాబట్టి. అయితే ఎంటి..? వాటికెంటి ప్రత్యేకత అంటారా..? క్రికెట్ లో బంతి స్టంప్స్ ను గిరాటెయ్యగానే మళ్లీ వాటిని తెచ్చి బ్యాట్ హేండిల్ తో కొట్టి పాతడం చూస్తుంటాం. తాజా ప్రపంచకప్ లో అలా కుదరదు. ఎందుకంటే ఇవి చాలా సున్నితమైనవి. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఎల్ ఈడీ స్టంప్స్, వాటికి చాలా ప్రత్యేకతలున్నాయి. వాటితో ముందుగా బంతి తగలగానే అవి వెలిగిపోతుంటాయి.
మూడు ఎల్ఈడీ స్టంప్స్ ఖరీదు అక్షరాలా 24 లక్షల రూపాయలు. బెయిల్స్ ధర దాదాపు 50 వేల రూపాయలు. మొత్తంగా సుమారు పాతిక లక్షలన్నమాట. ఎల్ఈడీ స్టంప్స్ తో అంపైర్ల పని సులువైంది. బంతికి వీటికి తగిలినప్పుడు వీటిలోని లైట్లు దానంతట అవే వెలుగుతాయి. బంతి తగిలింది, లేనిది స్పష్టంగా అర్థమవుతుంది. 2013 బిగ్ బాష్ లో తొలిసారిగా ఎల్ ఈడీ స్టంప్స్ వాడారు. తర్వాత టి20 ప్రపంచకప్ లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. వీటిపై సానుకూల స్పందన రావడంతో వన్డే వరల్డ్ కప్ లోనూ వాడుతున్నారు. ఈ మొత్తం సెట్ విలువ దాదాపు రూ. 25 లక్షలు. అందుల్లే మ్యాచ్ ముగిసిన తర్వాత స్టంప్స్ ను పీకడానికి అనుమతించడం లేదని వీటి సృష్టికర్త ఎకెర్ మాన్ తెలిపారు.
మ్యాచ్ గెలిచిన వెంటనే స్టంప్స్ తీసుకెళ్లడం ఇదివరకు జరిగేది. అది విజయగర్వంగా కూడా చెప్పుకునే వాళ్లు. కానీ తాజాగా అమర్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇమిడివున్న స్టంప్స్ వల్ల వాటిని తీసుకెళ్లడం కుదరదని ఆటగాళ్లకు ఐసీసీ కూడా స్పష్టం చేసింది. తన వాణిజ్య భాగస్వామి డేవిడ్ లీజిత్ వుడ్ తో కలిసి సుమారు మూడేళ్ల పాటు కష్టపడి అతడు వీటిని తయారు చేశాడు. వీటిని చాలా జాగ్రత్తగా వాడాల్సివుంటుందని అతడు తెలిపాడు. లసిత్ మలింగ యార్కర్ కు స్టంప్స్ విరిగిపోయే ప్రమాదముందని ఎకెర్ మాన్ భయపడుతున్నాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more