వన్డే ప్రపంచకప్ లో తొలి విజయాన్ని న్యూజీలాండ్ తన పేరున నమోదు చేసుకుంది. పూల్ ఏ కు చెందిన శ్రీలంకతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో అదే పూల్ కు చెందిన న్యూజిలాండ్ 98 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కివీస్ విసిరిన 332 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక మరోసారి పేలవమైన ఫామ్ ను మూటగట్టుకుని ఘోర పరాజయాన్ని చవిచూసింది. శ్రీలంక ఆటగాళ్లలో ఓపెనర్ తిరిమన్నే(65) చూడచక్కని షాట్లతో అలరించినప్పటికీ మరో ఓపెనర్ దిల్షాన్ (24)పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఆ తరుణంలో తిరిమన్నేకు జత కలిసిన కుమార సంగక్కార కాసేపు మెరుపులు మెరిపించాడు. సంగక్కార క్రీజ్ లో నిలదొక్కుకుంటున్నాడనే సమయంలో తిరిమన్నే పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక పతనం ప్రారంభమయ్యింది. వరుసగా కరుణరత్నే(14), జయవర్ధనే డకౌట్ గా పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక తేరుకోలేకపోయింది. ఆ తరువాత సంగక్కార( 39) పరుగులకు పెవిలియన్ కు చేరాడు. చివర్లో కెప్టెన్ మాథ్యూస్(46) పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 46 ఓవర్లలో చాపచుట్టేసిన శ్రీలంక 233 పరుగులకే పరిమితమయ్యింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ, బౌల్ట్, వెటోరీ, మైల్నీలు తలో రెండు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 332 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. ఓపెనర్లు గుప్తిల్(49), మెక్ కల్లమ్(65)పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం కేన్ విలియమ్సన్(57) పరుగులతో ఆకట్టుకున్నాడు. అటు తరువాత పించ్ హిట్టర్ సీజే అండర్సన్ తనదైన శైలిలో ఆడుతూ శ్రీలంక బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. 46 బంతులను ఎదుర్కొన్న అండర్సన్ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్స్ లు సాయంతో 75 పరుగులు చేసి చివరి బంతికి పెవిలియన్ కు చేరాడు. అతనికి జతగా రోంచీ(29) నాటౌట్ గా క్రీజ్ లో ఉండటంతో కివీస్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల కోల్పోయి 331పరుగులు చేసింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more