భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇప్పుడు కుటుంబం కన్నా ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీలే ముఖ్యంగా మారాయి. ఆయన భార్య సాక్షి రావత్ సింగ్ శుక్రవారం సాయంత్రం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ పోటీలకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న ధోనీ ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు. ఈ సమయంలో ప్రపంచ కప్ ముఖ్యమని, సాక్షిని చూడడడం కన్నా అది ముఖ్యమని ఆయన భావిస్తున్నాడు. గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాక్షి ఆడపిల్లకు శుక్రవారం సాయంత్రం జన్మనిచ్చింది. తల్లీకూతుళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. ధోనీ మాత్రం తన జట్టు సభ్యులతో ఆస్ట్రేలియాలో గడుపుతున్నాడు. అడిలైడ్లో ధోనీ శనివారం మీడియాతో మాట్లాడాడు.
ఈ సమయంలో మీరు మీ భార్యతో ఉండాలని అనుకుంటున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగితే లేదని చెప్పాడు. నిజానికి లేదు. నాకు కూతురు పుట్టింది. తల్లీకూతుళ్లు ఇరువురూ బాగున్నారు అని అన్నాడు. ఇప్పుడు తాను జాతీయ విధుల్లో ఉన్నానని, అందువల్ల ప్రతిదీ తన కోసం ఎదురు చూస్తుందని అన్నాడు. ప్రపంచ కప్ అత్యంత ముఖ్యమైందని ధోనీ అన్నాడు. భారత్ తన తొలి మ్యాచులో పాకిస్తాన్ను ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో ఎదుర్కుంటోంది. ప్రపంచ కప్ మార్చి 29వ తేదీన ముగుస్తుంది. అప్పటి వరకు ధోనీ తన కూతురిని చూసే అవకాశం లేదని అంటున్నారు సాక్షితో ధోనీ వివాహం 2010 జులై 4వ తేదీన జరిగింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more