ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పలువురు క్రికెట్ దిగ్గజాలు, పూర్వ బీసిసిఐ సభ్యులు, క్రికెటర్లు స్వాగతించారు. ఐపీఎల్, బిసిసిఐ నిబంధనల్లో మార్పలు, చేర్పులు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై వారు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు శుభసూచకమని మాజీ క్రికెట్ ఆటగాడు కీర్త ఆజాద్ పేర్కొన్నారు. క్రీడల్లో రాజకీయ నాయకులకు స్థానం ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆటలను మెరుగుపరిచేందుకు ఇంకా అనేకం చేయాల్సి ఉందని తెలిపారు. ఐపీఎల్లోనే కాదు.. చాలా బోర్డుల్లో అవినీతి ఉందని వాటిన్నింటిపై కూడా సుప్రీం దృష్టిసారించాలని కీర్తి ఆజాద్ అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఏసీ ముత్తయ్య అన్నారు. శ్రీనివాసన్ తాను తప్పించుకునేందుకు నిబంధనలనే మార్చివేశాడని ఆయన ఆరోపించారు. చెన్నై జట్టులో తన వాటాను వదులుకున్నా శ్రీనివాసన్ బీసీసీఐ ఎన్నికలకు అనర్హుడుగానే ఉంటాడని.. ఈ మేరకు సుప్రీం తీర్పును వెలువరించిడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఐసిసి పగ్గాలను చేపట్టాలని ఉవ్విళూరుతున్న శ్రీనివాసన్ కు ఇక అన్ని దారులు మూసుకుపోయనట్లేనన్నారు. సుప్రీం కోర్టు తీర్పును బీసీసీఐ స్వాగతిస్తోందని బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంటామని తెలిపారు. కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీకీ సంపూర్ణ సహకారమందిస్తామని చెప్పారు.
బీసీసీఐని ప్రజాసంస్థగా సుప్రీం కోర్టు పేర్కొంటూ మంచి తీర్పునిచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. శ్రీనివాసన్ను తప్పించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. క్రికెట్తో సంబంధమున్న అందరూ ఈ తీర్పు నుంచి పాఠం నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు. క్రికెట్ను ప్రేమించే తనకు ఈ పరిణామం చాలా బాధను కలిగించిందని భిషన్ సింగ్ బేడి అన్నారు. ఆటను గాడిన పెట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కలుగజేసుకోవాల్సి రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా బీసీసీఐను సమాచార హక్కు చట్ట పరిధిలోకి తీసుకురావాలని బేడి అభిప్రాయపడ్డారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more