ఐదు వన్డేల సిరీస్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా మిగతా రెండు మ్యాచ్ ల కోసం రెడి అవుతోంది. సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రాక్టీస్ చేస్తోంది. ఇక ముందు కేవలం మూడు వన్డేలకు ఆటగాళ్లను ప్రకటించిన సెలక్షన్ కమిటి తాజాగా మిగతా రెండు మ్యాచ్ లకు జట్టును ప్రకటించింది. ఇందులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ధోని విశ్రాంతి కారణంగా చివరి రెండు మ్యాచ్ లకు కూడా విరాట్ కొహ్లీని కెప్టెన్ గా ప్రకటించారు. ఇక మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ కు విశ్రాంతి ఇచ్చారు. ఆయన స్థానంలో రోహిత్ శర్మకు చోటు కల్పించారు.
ఇక ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రవింద్ర జడేజాకు కూడా విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా ధోని స్థానంలో వికెట్ కీపింగ్ చేసి ప్రభావం చూపలేకపోయిన వృద్ధిమాన్ సాహను ఏకంగా సిరీస్ జట్టు నుంచి తప్పించారు. ఇలా పలు మార్పులతో కొత్త జట్టును ప్రకటించారు. తాజా ప్రకటనతో విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, రాబిన్ ఊతప్ప, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, స్టూవర్ట్ బిన్నీ, వినయ్ కుమార్, ధవళ్ కులకర్ణి, అక్షర్ పటేల్, కర్ణ్ శర్మ, కేదార్ జాదవ్ చివరి రెండు మ్యాచ్ లు ఆడతారన్నమాట.
ఆదివారం ఉప్పల్ లో జరిగిన కీలకమైన మూడవ వన్డేలో టీమ్ ఇండియా గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. అయితే సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండటంతొ వాటికోసం కసరత్తు చేస్తోంది. ఈనెల 13న కోల్ కతాలో నాల్గవ వన్డే జరగనుంది. అదేవిధంగా 16న రాంచీలో చివరి మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది. తొలి మూడు వన్డేల ఫలితమే మిగతా రెండు మ్యాచ్ లలో పునరావృతం అవుతుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more