మన ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే! విశ్వవ్యాప్తంగా వున్న క్రికెట్ దిగ్గజాలు సైతం ధోనీలాంటి కూల్ కెప్టెన్ ఎవ్వరూ లేరని ప్రశంసలు కూడా ఇచ్చేశారు. రెండు ప్రపంచకప్ (వన్డే వరల్డ్ కప్, టీ20 కప్)లను అందించిన ధోనీ.. అప్పుడప్పుడు తీవ్ర విమర్శలకు కూడా గురయ్యాడు. అతనిని కెప్టెన్ గిరీ నుంచి తొలగించాలంటూ సీనియర్ ఆటగాళ్లూ పెదవి విరిచిన సందర్భాలూ వున్నాయి. అయితే ధోనీ తనమీద విమర్శలు వచ్చిన ప్రతీసారి ఆట ద్వారా బాగానే బదులిచ్చాడు. మొత్తానికి ఇక్కడ చెప్పదలచుకున్నది ఒక్కటే... ప్రపంచంలో వున్న క్రికెట్ కెప్టెన్ లు అందరూ ఒకవైపు వుంటే.. ధోనీ ఒక్కడే మరోవైపు వుంటాడు.
అందుకే.. ధోనీ విశ్వంలోనే తనదైన ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్నాడు. ఇతనికున్న ఈ భారీ క్రేజ్ ను అప్పుడే కొన్ని దిగ్గజ కంపెనీలు యాడ్ ద్వారా క్యాచ్ చేసుకున్నాయి. ఇతనిని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎన్నుకుని బాగానే బిజినెస్ చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా చిత్రపరిశ్రమలో వున్న నిర్మాతలు కూడా ధోనీని వాడుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అతని జీవితం మీద సినిమాను తెరకెక్కిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని.. డబ్బులను కూడా బాగానే దండుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది సినీ విశ్లేషకులు ప్రత్యేకంగా ధోనీ జీవితం మీద ఒక కథను రాసి, దానిని సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
‘‘ఎం.ఎస్.ధోనీ - ద అన్ టోల్డ్ స్టోరీ’’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. ఈ సినిమాలో ధోనీ పాత్రను బుల్లితెర నుంచి డైరెక్ట్ గా మూవీలోకి జంప్ అయి సక్సెస్ ను అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రపంచకప్ సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ధోనీకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు పూర్తిగా వున్నాయని.. ధోనీ అనుభవించిన కష్టాల గురించి పొందుపరిచినట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more