భారత డాషింగ్ ఓపెనర్ అయిన వీరేందర్ సెహ్వాగ్.. తన గత అనుభవాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వ్యక్తపరిచాడు. తాను క్రికెటర్ కాకముందు తన తండ్రితో కలిసి వ్యవసాయం చేసుకునేవాడని... కానీ క్రికెట్ మీద ఇతనికున్న ఆసక్తిని గమనించిన తన తండ్రి ప్రోత్సాహంతోనే నేడు దిగ్గజ బ్యాట్స్ మెన్ జాబితాలోకి చేరిపోయినట్టు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఒకరు జీవితంలో ఏదైనా సాధించాలంటే అందుకు వెనకనుండి నడిపే ఎవరోఒకరి సహాయం ఎంతో అవసరం.. అది నాకు మా నాన్న నుంచి లభించింది’’ అని సెహ్వాగ్ పేర్కొంటున్నాడు.
ప్రస్తుతం కింగ్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఐపీఎల్ లో సత్తా చాటిన ఈ హీరో.. ఇప్పుడు ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20లోనూ రాణించడానికి ఎంతో ఉవ్విళ్లూరుతున్నట్టు పేర్కొన్నాడు. తన జట్టు సీఎల్ ట్వంటీ20లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈయన మాట్లాడుతూ... ‘‘చాంపియన్స్ ట్వంటీ20లో మా జట్టు పూర్తిగా రాణిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ టోర్నీ కోసం నేను జాజిగర్ లోని నా సొంత అకాడమీలో సాధన చేస్తున్నా. సెప్టెంబర్ 10వరకు అక్కడే ప్రాక్టీస్ చేసి.. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో చేరుతాను’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ‘‘మాది ఒక రైతు కుటుంబం. మా నాన్న వ్యవసాయం చేసి మమ్మల్ని పోషించాడు. ఒకవేళ నేను క్రికెటర్ ను కాకపోయి వుంటే ఆయనతోపాటు వ్యవసాయం చేసేవాడిని. కానీ క్రికెట్ మీద నాకున్న ఆసక్తిని చూసి ఆయన నాకు ఎంతో సహకారాన్ని అందించారు. ఎన్నో కష్టాలు పడి నన్ను ఈ పోజిషన్ కు తీసుకొచ్చారు. ఆయనలాంటి తండ్రి వుండటం నా అదృష్టం’’ అంటూ సెహ్వాగ్ తన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అక్టోబర్ 12వ తేదీన సీఆర్ పీఎఫ్ మారథాన్ లో పాల్గొంటున్నందుకు తనకు ఎంతో ఆనందంగా వుందని వీరూ చెప్పుకొచ్చాడు.
ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సెహ్వాగ్.. నేడు ప్రపంచం మొత్తం మీద గర్వించదగ్గ ఆటగాడి జాబితాలోకి చేరిపోయాడు. 99 స్కోరు వద్ద సిక్స్ కొట్టి సెంచరీ చేసే యోధుడు కేవలం సెహ్వాగేనని చెప్పడంలో ఎటువంటి అనుమానం వుండదు. భారత్ కు ఎన్నో విజయాలను అందించడంతోపాటు ఎన్నో పురస్కారాలను కూడా వీరూ తన స్వాధీనం చేసుకున్నాడు. సచిన్ లాంటి ప్లేయర్ తర్వాత సెహ్వాగేనని అందరూ మెచ్చుకునేలా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇటువంటి ప్లేయర్ ని కలిగి వుండటం నిజంగానే భారత్ కు గర్వించదగిన విషయమే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more