ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో ఇంత వింధ్యంసకర బ్యాట్స్ మెన్ ని ఎక్కడ చూడలేదు. క్రికెట్ లో ఓ బ్యాట్స్ మెన్ చెలరేగితే పరుగుల సునామీ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు మాక్స్ వెల్. ఐపీఎల్ ఆరంభం నుండి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేస్తున్న ఇతను మరోసారి చెన్నై పై చెలరేగి చెన్నై బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చాడు.
వరుస విజయాల జోరుమీదున్న చెన్నైకి పంజాబ్ జట్టు అడ్డుకట్ట వేసింది. నిన్న రాత్రి జరిగిన కటక్ లో బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు చెన్నై పై ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరుకుంది. మ్యాక్స్ వెల్ (38 బంతుల్లో 90, 8 సిక్సర్లు, 6 ఫోర్లు) బెయిలీ (13 బంతుల్లో 40, 6సిక్సర్లు, 6 ఫోర్ల) కు తోడు మిల్లర్ 47, సెహ్వాగ్ 30 పరుగులతో రాణించడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది.
తర్వాత బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (25 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్సర్), బి. మెకల్లమ్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), రైనా (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (20 బంతుల్లో 23; 1 సిక్సర్) పోరాడారు. జాన్సన్కు 2 వికెట్లు దక్కాయి. మ్యాక్స్వెల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more