పరాయి గడ్డపై ఒక్క మ్యాచ్ అంటే ఒక్కటి కూడా గెలవని ముంబైకి స్వదేశీ గడ్డపై జరిగిన మ్యాచ్ లో కలిగిన తొలి విజయం ఊరట కలిగించింది. అదే ఉత్సాహంతో పటిష్టమైన జట్టు బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్ ని మట్టి కరిపించి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న ఈ జట్టు రెండు స్థానాలు పైకి ఎగబాకింది.
బెంగుళూరు పై 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రోహిత్ (59; 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు), పొలార్డ్ ( 43; 31 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపు బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఓ దశలో 84 పరుగులకు 4 వికెట్లు కోల్పోయినస్థితిలో ఇద్దరూ ఐదో వికెట్కు 97 పరుగులు జోడించారు.
భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలో దిగిన బెంగళూరుకు గేల్ (38; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు), పార్థివ్ (26; 19 బంతుల్లో 5 ఫోర్లు), కోహ్లీ (35; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ తో తొలి మూడు ఓవర్లలోనే బెంగళూరు 43/0తో ఛేజింగ్ దిశగా జెట్స్పీడుతో కదిలింది.
కానీ ఈ మెరుపులు జట్టకు విజయాన్ని మాత్రం అందించలేక పోయాయి. గత మ్యాచ్ లో ఒంటి చేత్తో విజయాన్ని అందించిన డివిలియర్స్ ఈసారి (9), యువరాజ్ (6)ల వైఫల్యంతో 8 వికెట్లకు 168 పరుగులే చేసింది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more