మొన్నటి వరకు మ్యాక్స్ వెల్ అంటే పెద్దగా ఎవరి తెలియదు. ఆయన ధాటికి బలవుతున్న జట్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న చెన్నై, నిన్న రాజస్థాన్, నేడు హైదరాబాద్ రేపు ఇంక ఏ జట్టో కానీ మ్యాక్స్ వెల్ పేరు చెబితేనే హడలి పోతున్నారు బౌలర్లు. ఈ సీజన్ మొదలైనప్పటి నుండి బౌలర్లను ఊచ కోత కోస్తున్న మ్యాక్స్ వెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు.
హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో వీర బాధుడు బాది జట్టుకు మరో విజయాన్ని అందించాడు. మ్యాక్స్ వెల్ వింధ్వంసానికి సన్ రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్లు నిశ్చేస్టులయ్యారు తప్పితే ఏం చేయలేక పోయారు. షార్జా క్రికెట్ స్టేడియంలో పరుగుల సునామీ స్రుష్టిస్తుంటే ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ ఆదిలో నెమ్మదిగా పరుగులు చేయడం ప్రారంభించినా, సెహ్వాగ్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), పుజారా (32 బంతుల్లో 35; 6 ఫోర్లు) లతో పరుగుల వేగాన్ని పెంచారు.
ఆ తరువాత వచ్చిన మ్యాక్స్వెల్ (43 బంతుల్లో 95; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు సాధించింది. పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద వార్నర్ సులభమైన క్యాచ్ వలిస్తే... ఫలితం ఎలా ఉంటుందో హైదరాబాద్ జట్టుకు చూపించాడు. తరువాత బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ జట్టు లక్ష్యఛేధనలో ఏ మాత్రం పోరాట పటిమను కనబర్చ లేక పోయింది. 19.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది.
లోకేష్ రాహుల్ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఫించ్ (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్మెన్ నిరాశపర్చారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, మిశ్రా 2 వికెట్లు తీశారు. పంజాబ్ బౌలర్లలో బాలాజీ 4, జాన్సన్, అక్షర్ చెరో రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్ కి మూడో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more