సచిన్ టెండూల్కర్ తన మనసులోని అరుదైన ముత్యాలు బయటపెట్టారు. వెస్టిండీస్తో ముంబయిలో రెండో టెస్టు ముగిసిన వెంటనే తాను చేసిన వీడ్కోలు ప్రసంగం ముందుగా రాసుకున్న స్క్రిప్టు కాదనీ, అందులోని ప్రతిమాట తన హృదయం నుంచి తన్నుకొచ్చిందేనని భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు.
అయితే, ముఖ్యులనుకున్న ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావించాలని ముందుగానే అనుకున్నానని, అందు కోసం కొంత కసరత్తు చేశానని ‘నెట్వర్క్ 18’ గ్రూప్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ తెలిపాడు.
కోల్కతా మ్యాచ్ ముగిసిన తర్వాత వీడ్కోలు ప్రసంగం చేయాలని అనుకున్నట్టు చెప్పాడు. అయితే, ఆ విషయంపై నిర్ణయం తీసుకునేలోపే మ్యాచ్ ముగిసిందని అన్నాడు. కోల్కతా నుంచి ముంబయి వస్తున్నప్పుడు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకున్నానని తెలిపాడు.
ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోకపోతే, ముంబయి టెస్టు కూడా ముగుస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా అంతా తాను ఏం మాట్లాడతానోనని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాను మాత్రం దిక్కుతోచని స్థితిలో నిలబడాల్సి వస్తుందన్న విషయం అర్థమైందన్నాడు.
అందుకే, ముంబయి టెస్టు పూర్తయిన వెంటనే వీడ్కోలు ప్రసంగంలో ఏం చెప్పాలనే విషయంపై తర్జన భర్జన పడిన తర్వాత, ముఖ్యులైన వారిని పేరుపేరున తలచుకొని, వారికి కృతజ్ఞతలు తెలియచేయడం ఒక్కటే సరైన మార్గంగా కనిపించిందని అన్నాడు. తాను ప్రస్తావించిన పేర్లన్నీ ముందుగానే అనుకున్నవని, అయితే, ప్రసంగంలోని మిగతా అంశాలను భగవంతుడే తనతో పలికించాడని నమ్ముతున్నానని సచిన్ అన్నాడు.
ప్రసంగం సమయంలో ఉద్వేగానికి లోనవుతానన్న ముందుగానే ఊహించినట్టు చెప్పాడు. అందుకే, సీసాతో మంచినీరు తన వద్ద ఉంచుకున్నానని అన్నాడు. అంతకు ముందు ఎన్నడూ లేనంత సుదీర్ఘమైన ప్రసంగం తనకు అదేనని తెలిపాడు. మొత్తం మీద క్రికెట్కు తన వీడ్కోలు ఊహించిన దానికంటే ప్రశాంతంగానూ, సాఫీగానూ జరిగిపోయిందని అన్నాడు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more