వైజాగ్ క్రికెట్ స్టేడియం భారత జట్టుకు అచ్చొచ్చిన స్టేడియం. ఇంత వరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆ రికార్డుతో భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ని సొంతం చేసుకుంటుందని అనుకున్నారు. కానీ విస్టిండీస్ భారత్ ఆశల్ని నీరు గార్చుతూ ఆ స్టేడియంలో భారత్ కి ఉన్న రికార్డును పటా పంచలు చేసి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. వైజాగ్ స్టేడియాన్ని తన సొంత మైదానంలా ఫీలయ్యి డారెన్ స్యామీ చెలరేగి ఆడి విండీస్ కి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (100 బంతుల్లో 99; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్తో పాటు కెప్టెన్ ధోని (40 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్ చేసి భారత్ కి గౌరవ ప్రదమైన స్కోరును అందించారు. కోహ్లీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యాలు భారత స్కోరులో కీలక పాత్ర పోషించాయి. తరువాత బ్యాటింగ్ కి దిగిన వెండీస్ నిలకడగా ఆడుతూ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారత పర్యటనలో అది విశాఖ స్టేడియంలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
స్యామీతో పాటు విండీస్ తరఫున మరో ముగ్గురు బ్యాట్స్మెన్ అర్ధసెంచరీలు చేశారు. పావెల్ (70 బంతుల్లో 59;7 ఫోర్లు, 1 సిక్స్), డారెన్ బ్రేవో (54 బంతుల్లో 50; 8 ఫోర్లు) చక్కటి భాగస్వామ్యంతో నిలబెడితే...ఆ తర్వాత స్యామీ, సిమన్స్ (74 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more