మొన్నటి వరకు ఐపీఎల్ లో అదరగొట్టి, మళ్ళీ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫి లో పాల్గొన్న మన భారత ఆటగాళ్ళు ఏ మాత్రం అలసిపోకుండా, తన జోరు తగ్గకుండా నిన్న దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేశారు. బ్యాటింగులోనూ, బౌలింగులోనూ సమిష్టిగా రాణించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లను ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్ (114; 12 ఫోర్లు, 1 సిక్స్తో), రోహిత్ శర్మ (81 8 ఫోర్లు, 1 సిక్స్ )తో ధీటుగా ఎదుర్కోవడానికి తోడు చిరవర్లో రవీంద్ర జడేజా 47 నాటౌట్ అండగా నిలవడంతో భారత్ నిర్ణీయ 50 ఓవర్లలో 331 భారీ స్కోరు సాధించింది. అదే తరహాలో బౌలర్లు సైతం సమస్టిగా పోరాటంతో టీమిండియా విజయాన్ని దక్షిణాఫ్రికా అడ్డుకోలేకపోయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సఫారీలను ఆదిలోనే ఉమేష్, భువనేశ్వర్ షాక్ ఇచ్చారు. 8 పరుగుల తేడాతో చెరో వికెట్ పడగొట్టిన వీరిద్దరు దక్షిణాఫ్రికాను ఇబ్బందుల్లోకి నెట్టారు. కానీ మూడు, నాలుగు స్థానాల్లో బరిలోకి దిగిన పీటర్సన్ (68), డివిలియర్స్ (70) నిలకడగా ఆడి రెండో వికెట్కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరు క్రీజ్లో ఉన్నంత సేపు గెలుపుపై ఆశలు పెంచుకున్న సఫారీలకు జడేజా, ఉమేష్ యాదవ్ నిరాశ కల్గించారు. 38 పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయిన సపారీలకు ఆపద్భాందవుడి రూపంలో మెక్ లారెన్ (71 నాటౌట్) ఇన్నింగ్స్ను కొనసాగించినా విజయ తీరాలకు మాత్రం చేర్చలేక పోయాడు. దీంతో గ్రూపు బిలో తొలి విజయాన్ని భారత్ నమోదు చేసుకుంది. ఇక శిఖర్ ధావన్ వన్డేల్లో తొలిసెంచరీ నమోదు చేసుకోవడం మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్, రవీంద్ర డేజాలు తలా రెండేసి వికెట్లు పంచుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more