ఐపీఎల్ 6 టోర్నిలో భాగంగా నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. సురేష్ రైనా 53 బంతుల్లో (7 ఫోర్లు, 6 సిక్స్ ) లతో చెలరేగి 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. పంజాబ్ బ్యాట్స్ మెన్స్ షాన్ మార్ష్ 73 పరుగులు, మిల్లర్ 51 పరుగుల ఒంటరి పోరాటం చేశారు. వీరిద్దరు కలిసి దాదాపు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓ దశలో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో 20 పరుగులు కావాల్సి ఉన్నా, బ్రావో చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేసుకున్న సురేష్ రైనాకి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more