ముంబై ఇండియన్స్ జట్టుకు ఢిల్లీ మ్యాచ్ గుణపాఠం నేర్పినట్లు ఉంది. ఆ మ్యాచ్ లో భారీ స్కోరు చేసినా ఓటమి పాలవడంతో జీర్ణించుకోలేక పోయిన ముంబై, ఆ తరువాత వరుసగా కొల్ కత్తా, బెంగుళూరు, పంజాబ్ జట్లను చిత్తు చేసి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించింది. నిన్న రాత్రి మొహాలీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై 4 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. దిలోనే సచిన్ వికెట్ను కోల్పోయిన ముంబైని స్మిత్ (33), కార్తిక్ (25) ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్కు 32 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. అనంతరం క్రీజ్లోకి వచ్చిన రోహిత్ శర్మ అజేయంగా 79 పరుగులు సాధించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడు పొలార్డ్ (20) సైతం సహకరించడంతో పంజాబ్ ముందు 175 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది ముంబై. అనంతరం భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే తడబడి మన్దీప్సింగ్ 9, మార్ష్ 10, ఒహ్రా 1 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజ్లోకి వచ్చిన హస్సీ (34), మిల్లర్ (56) నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. వీరు అందించిన సూర్తితో చివర్లో ఛావ్లా (12), కుమార్ (24) తుదికంటా పోరాడినా పంజాబ్కు ఓటమి తప్పలేదు. ఆఖరు బంతికి ఐదు పరుగుల చేయాల్సిన సమయంలో ప్రవీణ్కుమార్ కొట్టిన భారీ షాట్ను సచిన్ క్యాచ్ తీసుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 170 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more