భారత్-ఆస్ట్రేలియాల మధ్య చివరి టెస్ట్ నేడు శుక్రవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ప్రారంభమయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో మళ్ళీ తేలిపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 231 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ నాలుగు పరుగుల ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఓపెనర్ వార్నర్(0) డకౌట్ అయ్యాడు. రెండో వికెట్కు 71 పరుగుల వద్ద హ్యూస్(45) ఔట్ అయ్యాడు. లంచ్ సమయానికి 94/2 పరుగులతో ఉన్న ఆస్ట్రేలియా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ భారత బౌలర్ల ముందు తలదించక తప్పలేదు. భారత ఆటగాడు ఇశాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కగా, అశ్విన్ నాలుగు, జడేజా రెండు వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరిచారు. ఆసీస్ బ్యాట్స్ లో హ్యూగేస్ : 45, కోవన్ : 38 తప్ప మిగితా వారు ఎవరూ రాణించలేదు. ప్రస్తుతం సిడ్లే (నాటౌట్) : 47, పట్టిన్సన్ (నాటౌట్) : 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొత్లం నాలుగు టెస్టుల్లో భాగంగా టీంఇండియా 3-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితి చూస్తుంటే భారత్ ఆసీస్ ని వైట్ వాష్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more