టీమిండియాలో రొటేషన్ పాలసీ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో వైస్ కెప్టెన్ సెహ్వాగ్ మరింత గందరగోళపరిచే వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం శ్రీలంకతో మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించిన సెహ్వాగ్.. ఈ మ్యాచ్లో భారత్ పరాజయం తరువాత మాట్లాడుతూ సీనియర్లు చురుకైన ఫీల్డర్లు కాదన్న ధోనీ వ్యాఖ్యల గురించి తనకు తెలియదన్నాడు. ఈ నెల 19న ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ ‘సీనియర్లు ఫీల్డ్ లో వేగంగా కదల్లేకపోతున్నారు. ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగ్గా ఉండేందుకే రొటేషన్ పాలసీని అమలు చేస్తున్నామ’ని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తమతో ధోనీ యువకులకు చాన్సిచ్చేందుకే రొటేషన్ను అమలు పరుస్తున్నట్లు చెప్పాడని సెహ్వాగ్ అన్నాడు. కెప్టెన్ హోదాలో మీడియాతో అతనేం మాట్లాడినా, దానిపై తాము ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నాడు. ఇక లంకపై మ్యాచ్లో ఓటమికి తనతోసహా బ్యాట్స్మెన్ అందరిదీ బాధ్యత అని, షాట్ల ఎంపికలో పొరపాట్ల వల్లే ఓడిపోయామని పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more