ట్రాఫిక్ పోలీసు విభాగానికి తొలిసారిగా కేటాయించిన ప్రత్యేక బడ్జెట్ విడుదలైంది. సచివాలయంలో ఈ నెల 6న ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఈ ఏడాదికి రూ. 8.58 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డు పడుతున్న నిధుల కొరత తీరనుంది. నిధులను ఏయే పనులకు కేటాయించాలనే అంశంపై ట్రాఫిక్ కమిషనరేట్లో ట్రాఫిక్ బాస్ సీవీ ఆనంద్తో పాటు సంయుక్త పోలీసు కమిషనర్ (పరిపాలన) మహేశ్ ఎం భగవత్ తదితరులు మంగళవారం భేటీ అయి చర్చించారు. మరికొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో మరోసారి సమావేశం కావాలని సిటీ అధికారులు నిర్ణయించారు. గతంలో ట్రాఫిక్ విభాగానికి స్వల్ప కేటాయింపులు ఉన్నప్పటికీ బడ్జెట్ మాత్రం లేదు. నగర ట్రాఫిక్ విభాగం ఏటా రూ. 20 కోట్లకు పైగా చలాన్ల రూపంలో వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తున్నా.. ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించక పోవడంతో మౌలిక వసతుల కోసం జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, ఉపకరణాల కోసం స్పాన్సరర్స్ను ఆశ్రయించాల్సి వస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతుల కల్పన తదితర పనులకు ట్రాఫిక్ పోలీసులు నిధుల కొరతతో సతమతమవుతున్నారు. దీనికి పరిష్కారంగా ఏటా వసూలు చేస్తున్న చలాన్ మొత్తం నుంచి కొంత భాగం యూజర్ చార్జీలుగా తిరిగి ఇవ్వాలనే ప్రతిపాదన ఏళ్లుగా సర్కార్ వద్ద పెండింగ్లో ఉంది. ఏడాదిన్నర క్రితం అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య 50 శాతం ఇచ్చేందుకు అంగీకరించినా కార్యరూపంలోకి రాలేదు. దీంతో ట్రాఫిక్ కాప్స్ ఇటీవల ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదన చేశారు. ట్రాఫిక్ విభాగంలో మౌలిక వసతులుగా భావించే కీలకమైన వాటి జాబితా రూపొం దించారు. శాశ్వత, తాత్కాలిక బారికేడ్లు, కమ్యూనికేషన్కు అవసరమైన మాన్ప్యాక్స్, ట్రాఫిక్ రద్దీని రాత్రి వేళల్లో నియంత్రించేందు అవసరమైన బ్యాటన్స్, జరిమానాల వసూలుకు వినియోగించే పీడీఏ మిషన్ల సమీకరణ, రాంగ్ పార్కింగ్లో ఉంచిన/బ్రేక్ డౌన్ వాహనాలను తరలించడానికి అవసరమైన క్రేన్ల నిర్వహణ, సిబ్బందికి అవసరమైన బైకులు, మాస్కులు, ఆక్సిజన్ బూత్లు తదితర అవసరాలకు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో వివరిస్తూ ఈ బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. సిగ్నల్స్ నిర్వహణ, మార్కింగ్స్ వంటి కీలక అంశాలను ఇందులో చేర్చారు. దీన్ని పరిశీలించిన హోం శాఖ ఆమోదం తెలిపి ఆర్థిక శాఖకు పంపింది. దీన్ని లోతుగా పరిశీలించిన ఆర్థిక మంత్రి ఆమోద ముద్ర వేశారు. |
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more