పేద మహిళల ఆకలి పొట్టలు అద్దె కడుపులవుతున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో ఆడవాళ్ల గర్భాశయాలు కూడా ‘పొట్ట’కూటి కోసం కష్టపడుతున్నాయి. సంతానానికి నోచుకోని స్వదేశీ/విదేశీ వనితలకు మాతృత్వాన్ని ప్రసాదించేందుకు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. నగర కూడళ్లలో పడిగాపులు కాసే దినసరి కూలీల్లాగే ఇప్పుడు సిటీలోని ఫర్టిలిటీ సెంటర్ల వద్ద అద్దె తల్లులు నిరీక్షిస్తున్నారు. తక్కువ ఖర్చులోనే అద్దె గర్భం లభిస్తుండడంతో సంతానం లేని దంపతులు నగరానికి క్యూ కడుతున్నారు. కారణాలేవైనా చాలా మంది దంపతులు సంతానం కలగక అల్లాడుతున్నారు. కెరీర్ వేటలో పడి ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం, ల్యాప్టాప్లను ఒళ్లో పెట్టుకొని పని చేస్తుండడంతో హార్మోన్లపై ప్రభావం చూపడం, షిఫ్టుల వారీగా ఉద్యోగాలు, ఆహార సమతౌల్యత లోపించడం, మోతాదుకు మించి మద్యం తాగడం.. దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా చాలా మంది దంపతులు సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. పిల్లల కోసం నగరంలోని సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో వైద్యులు సరొగసీ పద్ధతిని సూచిస్తున్నారు. ఇందుకోసం విదేశాల్లో దాదాపు రూ.కోటి ఖర్చు అవుతుండ గా, హైదరాబాద్లో కేవలం రూ.10 లక్షలే అవుతోంది. దీంతో విదేశీయులు పిల్లల కోసం హైదారాబాద్కు తరలివస్తున్నారు. ఇలా ఒక్క రమా సంతాన సాఫల్య కేంద్రానికే ఏటా 20-30 మంది విదేశీయులు వస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. సరొగసీ పద్ధతిపై దేశవ్యాప్తంగా ఏటా రూ.1,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంటే, ఇందులో మన సిటీలోనే సగానికి పైగా జరుగుతున్నట్లు అంచనా. నిరక్షరాస్యతే కారణం.. నిబంధనలకు విరుద్ధంగా.. ఐఎంసీ నిబంధనలివీ.. విదేశీ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. |
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more