Surrogate mother

gay surrogacy, surrogacy for single parents, single parent surrogacy, gay law india, surrogacy lawyer, surrogate mother, legal mother,gay law india,legal mother,single parent surrogacy,surrogacy for single parents,surrogacy lawyer,surrogate mother,uncategorized

gay surrogacy, surrogacy for single parents, single parent surrogacy, gay law india, surrogacy lawyer, surrogate mother, legal mother,gay law india,legal mother,single parent surrogacy,surrogacy for single parents,surrogacy lawyer,surrogate mother,uncategorized

Surrogacy in Hydarabad.GIF

Posted: 01/27/2012 04:54 PM IST
Surrogate mother

Surrogacy_in_Hydarabad2

Suroogacy-motherపేద మహిళల ఆకలి పొట్టలు అద్దె కడుపులవుతున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో ఆడవాళ్ల గర్భాశయాలు కూడా ‘పొట్ట’కూటి కోసం కష్టపడుతున్నాయి. సంతానానికి నోచుకోని స్వదేశీ/విదేశీ వనితలకు మాతృత్వాన్ని ప్రసాదించేందుకు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. నగర కూడళ్లలో పడిగాపులు కాసే దినసరి కూలీల్లాగే ఇప్పుడు సిటీలోని ఫర్టిలిటీ సెంటర్ల వద్ద అద్దె తల్లులు నిరీక్షిస్తున్నారు. తక్కువ ఖర్చులోనే అద్దె గర్భం లభిస్తుండడంతో సంతానం లేని దంపతులు నగరానికి క్యూ కడుతున్నారు.

కారణాలేవైనా చాలా మంది దంపతులు సంతానం కలగక అల్లాడుతున్నారు. కెరీర్ వేటలో పడి ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం, ల్యాప్‌టాప్‌లను ఒళ్లో పెట్టుకొని పని చేస్తుండడంతో హార్మోన్లపై ప్రభావం చూపడం, షిఫ్టుల వారీగా ఉద్యోగాలు, ఆహార సమతౌల్యత లోపించడం, మోతాదుకు మించి మద్యం తాగడం.. దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా చాలా మంది దంపతులు సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. పిల్లల కోసం నగరంలోని సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో వైద్యులు సరొగసీ పద్ధతిని సూచిస్తున్నారు. ఇందుకోసం విదేశాల్లో దాదాపు రూ.కోటి ఖర్చు అవుతుండ గా, హైదరాబాద్‌లో కేవలం రూ.10 లక్షలే అవుతోంది. దీంతో విదేశీయులు పిల్లల కోసం హైదారాబాద్‌కు తరలివస్తున్నారు. ఇలా ఒక్క రమా సంతాన సాఫల్య కేంద్రానికే ఏటా 20-30 మంది విదేశీయులు వస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. సరొగసీ పద్ధతిపై దేశవ్యాప్తంగా ఏటా రూ.1,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంటే, ఇందులో మన సిటీలోనే సగానికి పైగా జరుగుతున్నట్లు అంచనా.

నిరక్షరాస్యతే కారణం..
అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా, తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ కడుపును అద్దెకు ఇచ్చేందుకు మహిళలెవరూ ముందుకు రారు. కానీ దగ్గర అలా కాదు. నిరక్షరాస్యత, పేదరికం వల్ల చాలా మంది స్త్రీలు ఇంటి పనులకే పరిమితం అవుతున్నారు. ఉపాధి లేక పూడగడవడం కష్టంగా మారడంతో కొంత మంది తమ ఆరోగ్యాన్ని, కట్టుబాట్లను లెక్కచేయకుండా సరొగేట్ మదర్స్‌గా మారేందుకు అంగీకరిస్తున్నారు. అయితే తొమ్మిది నెలల పాటు ‘గర్భాన్ని’ మోసినందుకు వీరికి లభిస్తున్నది రూ.1-2 లక్షలే.

నిబంధనలకు విరుద్ధంగా..
ఆస్పత్రికి వచ్చిన దంపతులకు ముందు పరీక్షలు నిర్వహిస్తారు. లోపం ఎవరిలో ఉందో తెలుసుకుంటారు. మందులు వాడినా, దాంపత్య జీవితంలో వైద్య సూచనలు పాటించినా.. ఫలితం లేని దంపతులకు ముందు ఐవీఎఫ్ పద్ధతిని సూచిస్తారు. భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని శుద్ధిపరిచి, ఇంజెక్షన్ సహాయంతో భార్య గర్భంలో పొందుపరుస్తారు. అయినా ఫలితం లేకపోతే అప్పుడు సరొగసీ పద్ధతిని సూచి స్తారు. దంపతుల నుంచి సేకరించిన వీర్యకణాలను అండకణాలతో ల్యాబ్‌లో ఫలదీకరణం చేయిస్తారు. తర్వాత దీన్ని అద్దె గర్భంలో పొందుపరుస్తారు. నిబంధనల ప్రకారం తమ కడుపులో బిడ్డను పెంచేందుకు బాధితుల తరఫు బంధువులెవరైనా ముందుకొస్తేనే ఈ పద్ధతి సూచించాలి. కానీ కాసులకు కక్కుర్తి పడుతున్న పలువురు వైద్యులు మురికివాడల్లోని నిరుపేద మహిళలకు డబ్బును ఆశచూపి, గర్భాన్ని అద్దెకు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎవరికి వారు ఓ ప్రత్యేక ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో కేసుకు వారికి రూ.20-50 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం.

ఐఎంసీ నిబంధనలివీ..
భారత్‌లో సరొగేట్ మదర్స్‌పై ప్రత్యేక చ ట్టాలంటూ ఏమీ లేవు. కానీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఐఎంసీ) ప్రత్యేక నిబంధనలు పేర్కొంది. దంపతులకు ముందు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, లోపాన్ని గుర్తించాలి. వీర్యకణాలు సమపాళ్లలో ఉన్నా, గర్భసంచిలో ఇన్‌ఫెక్షన్, ఇతర అనారోగ్య కారణాలుంటే సరొగసీ పద్ధతిని సూచించాలి. అయితే సరొగేట్ మదర్ బాధితుల తరుపు బంధువై ఉండాలి. బాధితులకు వైద్యులే స్వయంగా సరొగేట్ మదర్‌ను సమకూర్చకూడదు. 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ అవకాశం కల్పించొద్దు. విదేశీ దంపతులకు వైద్యం చేసేముందు ఆయా దేశాల్లోని న్యాయపరమైన అంశాలను, రవాణా చట్టాలను, జన్యుపరమైన చిక్కులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

విదేశీ చట్టాలు ఏం చెబుతున్నాయంటే..
విదేశీయులకు భారతీయ సరొగేట్ మదర్‌ను సమకూర్చే ముందు ఆయా దేశాల్లోని చట్టాలు, జన్యుపరంగా తలెత్తే వివాదాలపై అవగాహన అవసరం. అమెరికా చట్టం ప్రకారం.. వీర్య/అండ కణాల దాతల్లో ఎవరో ఒకరు ఆ దేశ పౌరులై ఉండాలి. పుట్టిన బిడ్డకు అమెరికా పౌరుడు/పౌరురాలి జన్యువుతో సంబంధం ఉండాలి. డీఎన్‌ఏ టెస్ట్‌లోనూ ఇదే అంశం తేలాలి. లేకుంటే పౌరసత్వం ఇవ్వరు. తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యాన్‌బూటెన్ కుమారుడికి వీసా నిరాకరిస్తుండడానికి కారణమిదే. బూటెన్‌ది అమెరికా అయినా.. వీర్యం ఇచ్చిన భర్తది జమైకా.. అండకణాలు ఇచ్చిన మహిళది ఇండియా కావడంతో సమస్య జఠిలమైంది. ఇక, బ్రిటన్ దంపతులు సరోగసీని అద్దెకు తీసుకోవాలంటే.. సరొగేట్ మదర్‌కు పెళ్లి కాకూడదు. లేదా, వితంతువై ఉండాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mmts second phase
Traffic police budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more