ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద తెదేపా ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి మాట్లాడుతుండగా తెరాస ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అడ్డు తగిలారు. జై సమైక్యాంద్ర అంటూ సతీష్ రెడ్డి బిల్లు ప్రతులను చించివేశారు. దీంతో తెదేపా, తెరాసా ఎమ్మెల్యేల మద్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కిందపడ్డారు. పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకున్నారు. అనంతరం ఇరు పార్టీల ఎమ్మెల్సీలు బల్లపైకెక్కి నినాదాలు చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద దాదాపు గంటే సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులపై రాళ్లదాడి
ఎప్పుటిలానే తెలంగాణలో ఉద్రిక్తత అనగానే ఉస్మానియా విధ్యార్ధులు గుర్తుకు వస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. ఈరోజు అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన సీమాంధ్ర నేతలపై ఉస్మానియా విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి ఈరోజు ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్ లో గవర్నర్ పాలనను అంగీకరించేది లేదంటూ వారు తమ నిరసనలు తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఓయూ విద్యార్థుల ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎన్ సీసీ గేట్ వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ...రాళ్లతో దాడి చేయటంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more
Dec 12 | ఈరోజుతో శీతకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ద్రుష్టి మొత్తం అసెంబ్లీ మీదే ఉంది. ఈరోజు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్తో పాటు కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు నగరానికి... Read more