రేపటినుండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమౌతున్న నేపథ్యంలో ఫీజులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీజుల వివాదానికి తెరదించుతూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 689 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అందులో 645 కాలేజీలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆరోవేతనసంఘం లెక్కలప్రకారం A.F.R.C కి అఫిడవిట్లు సమర్పించిన 67 కాలేజీల్లో వేరువేరుగా ఫీజులను ఖరారు చేసింది.
అందులో హైదరాబాద్ లోని సిబిఐటీ లక్ష ఐదువేల రూపాయల ఫీజుతో టాప్ లో ఉండగా దాని తరువాత వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో 98వేల 700 రూపాయలు, వరంగల్ లోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 95 వేలరూపాయలు ఫీజులు ఉండబోతున్నాయి. అంతేగాక ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును ఒప్పుకుంటూ A.F.R.C కి అంగీకారపత్రాలు సమర్పించిన 578 కాలేజీలకు 35వేల రూపాయలను ఫీజుగా ప్రభుత్వం ఖరారుచేసింది. అయితే రాష్ట్రంలోని మొత్తం 689 ఇంజనీరింగ్ కాలేజీల్లో 44 కాలేజీలు మాత్రం A.F.R.C కి ఎలాంటి అఫిడవిట్లు సమర్పించలేదు. దీంతో ఆ 44 కాలేజీల ఫీజుల వివరాలను ప్రభుత్వం ప్రకటించలేదు. అంతేగాక హైకోర్ట్ తీర్పును ఉటంకిస్తూ ఆ 44 కాలేజీల ఫీజులకు సంబంధించి ఎఎఫ్ ఆర్సీ మరొకసారి పునఃసమీక్షించి ఖరారు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇంజనీరింగ్ తో పాటు బి.ఫార్మసీ, ఫార్మా డి, బి.ఆర్క్ కోర్సులకు సైతం ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. బిఫార్మసీలో ఆరోవేతనసంఘం లెక్కలప్రకారం ఎఎఫ్ ఆర్సీకి అఫిడవిట్లు సమర్పించిన 5 ఫార్మసీ కాలేజీల్లో వేరువేరుగా ఫీజులు ఉండనున్నాయి. అయితే బిఫార్మసీ కోర్సుకు ఫీజు 31వేల రూపాయలకు అంగీకరిస్తూ ఎఎఫ్ఆర్సీకి అండర్ టేకింగ్ ఇచ్చిన 74 కాలేజీల్లో 31వేలు, 35వేల రూపాయలకు అంగీకరిస్తూ ఎఎఫ్ఆర్సీకి అండర్ టేకింగ్ ఇచ్చిన 162 కాలేజీల్లో 35వేల రూపాయల ఫీజులను సర్కార్ ఖరారు చేసింది. వీటికి తోడు ఫార్మా డి కోర్సుకు 19 కాలేజీల్లో 68వేలు, బిఆర్క్ కోర్సుకు రెండు కాలేజీల్లో 35వేల చొప్పున ఫీజులు ఉండనున్నాయి. ఫీజుల వివాదం సద్దుమణిగిందనుకుంటే మరోవైపు ఫీజురీయింబర్స్మెంట్ పథకం అమలుపై నీలినీడలుకమ్ముకున్నాయి.
గత ఏడాది వరకు ఫీజులు మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. అయితే ఈయేడాది నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాటగిరీలు ఏర్పడి 74 కాలేజీల్లో ఫీజలు వేర్వేరుగా ఉన్నాయి. దీంతో సర్కారు మాత్రం ఇప్పటికప్పుడు ఫీజురీయింబర్స్మెంట్ పథకంలో 35 వేల వరకు మాత్రమే చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఫీజులు అధికంగా ఉన్న 74 కాలేజీల్లో చేరే విద్యార్థులు 35వేలకు పైన ఎంత ఫీజు ఉన్నా ఆ మిగిలిన మొత్తాన్ని వారే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిఉంది.. 100 శాతం ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించాలా? లేక సీలింగ్ పెట్టాలా అన్న విషయంపై కేబ్ నెట్ సబ్ కమిటి రేపు మరోసారి భేటీ అయి నిర్ణయించనుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more