‘‘ఇల్లు కాలి ఒక అతను ఏడుస్తుంటే...? చుట్టకు నిప్పు కావలన్నాడట మరొకడు’’ అనే మాదిరిగా మంత్రి శంకర్రారావు పరిస్థితి తయారైందట. ఒక పక్క తన మంత్రి పదవి పోయి ఏడుస్తుంటే.. మరొక పక్క ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ మాత్రం మంత్రి శంకర్రరావు అండగా నేను ఉండాను అంటూ కొత్త గాళం ఎత్తుకున్నాడు. అయిన ‘‘ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట’’ అనే విధంగా ఉందని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు.
రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకర్రావును రాష్ట్ర కేబినేట్ నుండి తొలగిస్తున్నట్లు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారట. సీఎంకు శంకర్రావు పై ఎప్పటి నుండో మంత్రి వర్గం నుండి తప్పించాలని అనుకుంటున్నారట. అయితే మంత్రి వర్గం లో కొత్తగా పీఆర్పీ నుండి వచ్చిన వారిని తీసుకోవటంతో.. శంకర్రావుకు రాహుకాలం మొదలైందట.
అసలే శంకర్రావు పై ఎప్పటి నుండో కోపంగా సీఎంకు, కాలం కలిసివచ్చిందట, అదీగాక అధిష్టానం కూడా శంక్రరావు పై గుర్రుగానే ఉందట. ఎందుకంటే .. కాంగ్రెస్ పార్టీలోని నాయకులపై యుద్దం చేయటానికి సిద్దపడటం, ఒకనొక సమయంలో అధిష్టానం అంటే ఎవరో తెలియదని మీడియా ముందు అరవటం, అన్ని శంకర్రావు బాగా కలిసి వచ్చాయట. అమ్మ అమ్మ అంటున్న, శంకర్రావు ఆ అమ్మకే విసుగు పుట్టించాడట. అందుకే అమ్మ దెబ్బ ఎలా ఉంటుందో .. సీఎం కిరణ్ ద్వారా తెలుసుకోమని శంకర్రావును సూచిందట.అసలే మనం సీఎం క్రికెట్ ఆడగాడు, ఇంకేముంది మంత్రి శంకర్రావును కెబినెట్ నుండి బంతిని బౌండ్రీకి పంపించినట్లు .. శంకర్రావును మంత్రి పదవిని పీకిపారేసాడట.
అసలు విషయం తెలుసుకున్న శంకర్రావు ‘‘నిప్పు తొక్కిన కొతిలా’’ అరవటం మొదలుపెట్టిన విషయంతెలిసిందే. ఇదే అదునుగా చూసుకోని మందకృష్ణ రెచ్చిపోయి ..ఒక దళిత మంత్రికి ఇంత ఘోరం చేస్తార అంటూ రాష్ట్రంలో ధర్నాలు మొదలుపెడుతున్నాడట.
శంకర్ రావు పై వేటుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడట. ఇతర దళిత సంఘాలతో కలిసి ఈ నెల 21న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తాడట. అలగే 22న కూడా మండల కార్యాలయాల ముందు కూడా ధర్నాలు చేస్తాడట. ( 22న ఆదివారం అని కూడా తెలియని పరిస్థిలో మంద ఉన్నడని కొందరు అంటున్నారు) ఎందుకంటే ఆదివారం సెలవు దినం కాబట్టి మండల కార్యాలయాలు కూడా సెలవు ఉంటుందనే విషయం తెలియాని మంద శంకర్రావు పై ముందుకు ఎలా పోతాడని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. మంద కృష్ణ ఇంక 23న రహదారులు దిగ్బంధిస్తామని , 26న బ్లాక్ డేగా పాటిస్తున్నమని, 27న దళిత సంఘాలతో చర్చించి కాంగ్రెస్ పై దళితుల తిరుగుబాటు ఉద్యమం చేస్తారట.
అసలు ‘‘ చేతులు కాలేకా ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది’’ అనే విధంగా మంత్రి శంకర్రావుకు ఎందుకు , జగన్, హోం మంత్రి సబిత ఇంద్ర రెడ్డిని, ఇంక తదితరులను, వదలకుండా హచ్ డాగ్ మాదిరిగా వెంటబడుతుంటే .. ఎవరు ఒకరు కాళ్లు విరగొడతారు అనేది శంకర్రావు దగ్గర రుజువు అయ్యిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆయన మంత్రి పదవి ఏదో అది చూసుకోక , పక్క వారితో ఆయన ఏపనని, అంటే ‘‘ చింత చచ్చిన పులుపు చావలేదట’’ ఆ మాదిరిగా శంకర్రావు పరిస్థితి ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
మంద కృష్ణ ఇలా గోల చేయటం వెనక శంకర్రావు పై ప్రేమతో కాదట. అసలే పైసల్ అంటే మందకు మక్కువట. అదే ఆయుధంగా తీసుకొని కాంగ్రెస్ లో కొంత మంది నాయుకులైన బొత్స, సీఎం , సబితా ఇంద్రా రెడ్డి లు, శంకర్రావు ఏడుపు అడ్డు కట్ట వేయాలని మందను రెచ్చగొట్టరట. అసలే శంకర్రావు కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారిన విషయం తేలిసిందే. అందులో సీఎం కు, సబితాకు, ఇంక తలనొప్పిగా మారేడని అందరికి తెలిసిందే. మంద శంకర్రావును వెనకేసుకురావటానికి కారణం ఇదేనని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more