గత కొన్ని రోజులుగా వరుసగా సినిమా ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తమ అద్భుత ప్రావిణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్గుల్ని చేసిన అనేక మంది ప్రముఖులు అనంతవాయువుల్లో ఐక్యం అవుతున్నారు. తాజాగా కాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ బాంబా బాక్య (49) మృతి చెందాడు. కొన్నేళ్ల క్రితమే కోలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన తన సుమధుర గాత్రంతో పాడిన పాటలు శ్రోతలను ఎంతగానే ఉత్తేజపర్చాయి. మరిన్ని చిత్రాల ద్వారా తమ మధురు గాత్రాన్ని అందించాల్సిన ఈయన అకస్మాత్తుగా మరణించారు.
బాంబా బాక్య మృతికి కారణాలు ఏమై ఉంటాయన్న వివరాలు మాత్రం తెలియలేదు. కాగా పలు తమిళ మీడియా సంస్థలు మాత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతోనే బాంబా బాక్య మరణించినట్లు తెలుపాయి. దీంతో ఆయన అభిమానులు అందోళనకు గురయ్యారు. తన పాటలతో ఉత్సాహాన్ని కల్గించిన గాయకుడు.. చిన్న వయస్సులోనే అనంతవాయువుల్లో ఐక్యం అయ్యాడని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో పలు చార్ట్ బస్టర్ పాటలు పాడి, సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ లోని ‘పొంగేనది’ పాటను ఈయనే ఆలపించాడు. బాంబా బాక్య మరణం పట్ల కోలీవుడ్ సీని ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బాంబా బాక్య ‘రోబో 2.0’ చిత్రంలో ‘పుల్లినంగల్’ పాటతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘సర్కార్’ చిత్రంలో ‘సింతాంగరం’, పొన్నియిన్ సెల్వన్లో ‘పొన్నినది’ వంటి పలు పాటలను ఆలపించాడు. ఎక్కువగా ఏ.ఆర్ రెహామాన్ సినిమాల్లోనే బాంబా బాక్య పాటలు పాడాడు. సినిమాల్లోకి రాకముందు ఈయన డివోషనల్ సాంగ్స్ పాడేవాడు. బాంబా బాక్య మరణం పట్ల హీరో కార్తి ట్విట్టర్లో ‘బాంబే బాక్య ఆకస్మిక మరణం భాద కలిగించింది. ఈ భాదను, నష్టాన్ని తట్టుకునే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఉండాలిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more