కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ సినీప్రముఖులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా కదం కలుపుతున్నారు. ఇప్పటికే యాంకర్ ప్రదీప్ టెలివిజన్ రంగంలో రోజువారీ వేతనానికి పనిచేసే 50 నుంచి 60 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలియజేయగా, తాజాగా బుల్లితెర ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తన వంతు సాయాన్ని ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు రెబెల్ స్టార్ ప్రభాస్ తరువాత ప్రధాని సహాయ నిధికి రాష్ట్రం చలనచిత్ర రంగం నుంచి విరాళాన్ని ప్రకటించింది ఈ జబర్ధస్త్ యాంకర్.
రష్మీ గౌతమ్ పీఎం కేర్స్ ఫండ్కి తనవంతు విరాళమందించినట్లు తెలిపింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘జబర్ధస్త్’ షో ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న రష్మీ.. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన వంతు సాయం అందించింది. తాజాగా రష్మీ కూడా పీఎం కేర్స్కు రూ. 25000 పంపించి తన ఉదారతను చాటుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. పీఎం కేర్స్కు పంపించిన ఫండ్కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఆమె తన ట్వీట్కు యాడ్ చేసింది.
‘నా వంతు సాయం నేను అందించాను. ప్రతి ఒక్కరూ ఈ కష్టకాలంలో తమకు తోచినంతగా సాయం చేయండి’’ అని రష్మీ కోరింది. చాలా మంచి పని చేసావంటూ పలువురు రష్మీని అభినందిస్తుంటే.. టీవీ షోలకు ఎపిసోడ్కు ఇంత అని చార్జ్ చేసే రష్మీకి 25 వేలు పెద్ద అమౌంట్ కాదని, పీఎం ఫండ్కు కాబట్టి కాస్త పెద్దమొత్తంలో డొనేట్ చేసుంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి పీఎం కేర్స్ ఫండ్కు విరాళమందించింది రష్మీనే కావడం విశేషం.
I have donated 25000 as of now
— rashmi gautam (@rashmigautam27) March 30, 2020
will be doing my bit by donating to a few honest NGO's too while I use my resources too feed the hungry voiceless around
Requesting one and all to do there bit too come forward and help in which ever way possible pic.twitter.com/yYHiq4LZm1
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more