కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ సినీప్రముఖులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా కదం కలుపుతున్నారు. ఇప్పటికే యాంకర్ ప్రదీప్ టెలివిజన్ రంగంలో రోజువారీ వేతనానికి పనిచేసే 50 నుంచి 60 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలియజేయగా, తాజాగా బుల్లితెర ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తన వంతు సాయాన్ని ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు రెబెల్ స్టార్ ప్రభాస్ తరువాత ప్రధాని సహాయ నిధికి రాష్ట్రం చలనచిత్ర రంగం నుంచి విరాళాన్ని ప్రకటించింది ఈ జబర్ధస్త్ యాంకర్.
రష్మీ గౌతమ్ పీఎం కేర్స్ ఫండ్కి తనవంతు విరాళమందించినట్లు తెలిపింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘జబర్ధస్త్’ షో ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న రష్మీ.. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన వంతు సాయం అందించింది. తాజాగా రష్మీ కూడా పీఎం కేర్స్కు రూ. 25000 పంపించి తన ఉదారతను చాటుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. పీఎం కేర్స్కు పంపించిన ఫండ్కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఆమె తన ట్వీట్కు యాడ్ చేసింది.
‘నా వంతు సాయం నేను అందించాను. ప్రతి ఒక్కరూ ఈ కష్టకాలంలో తమకు తోచినంతగా సాయం చేయండి’’ అని రష్మీ కోరింది. చాలా మంచి పని చేసావంటూ పలువురు రష్మీని అభినందిస్తుంటే.. టీవీ షోలకు ఎపిసోడ్కు ఇంత అని చార్జ్ చేసే రష్మీకి 25 వేలు పెద్ద అమౌంట్ కాదని, పీఎం ఫండ్కు కాబట్టి కాస్త పెద్దమొత్తంలో డొనేట్ చేసుంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి పీఎం కేర్స్ ఫండ్కు విరాళమందించింది రష్మీనే కావడం విశేషం.
I have donated 25000 as of now
— rashmi gautam (@rashmigautam27) March 30, 2020
will be doing my bit by donating to a few honest NGO's too while I use my resources too feed the hungry voiceless around
Requesting one and all to do there bit too come forward and help in which ever way possible pic.twitter.com/yYHiq4LZm1
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more