యాంకర్, నటి రష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అంతకు మించి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో రష్మీ అందాల అరబోతలో కూడా అంతకు మించి ప్రేక్షకులకు కనువిందు చేసిందన్న వార్తలు ఓ వైపు చిత్రానికి నెగిటివ్ టాక్ గా మారుతున్న తరుణంలో నను సంప్రదించకుండానే చిత్రాన్ని విడుదల చేశారని ఓ నిర్మాత బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసి కేసు నమోదు చేయించాడు. ఈ చిత్రం హీరో, నిర్మాత సతీష్ జాయ్ తనను మోసం చేశాడని, కోర్టు ఆదేశాలను దిక్కరించాడని ఆయన పిర్యాదు చేశారు.
కేసు వివరాల్లోకి వెళ్లితే.. గౌరీశంకర్ ప్రసాద్ శ్రీకృష్ణ క్రియేషన్ బ్యానర్ పేరుతో ‘అంతకు మించి’ టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే సినిమా ఆపేశాడు. దీంతో సతీష్ తానే హీరోగా ఉండి సినిమా పూర్తి చేస్తానని చెప్పి నిర్మాణ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభానికి ముందు గౌరీశంకర్ ఖర్చు పెట్టిన రూ.50 లక్షలను విడుదలకు ముందే చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.
సినిమా 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని గౌరీశంకర్.. సతీష్ను అడిగాడు. సతీష్ ఇవ్వలేనని చెప్పడంతో గౌరీశంకర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు సినిమా విడుదలను ఆపేయాలని ఆదేశించింది. అయితే, సతీష్ కోర్టు ఆదేశాలు ఖాతరు చేయకుండా ముందుగా చెప్పిన తేదీ కంటే ముందే ఆగస్టు 24న (శుక్రవారం) సినిమా విడుదల చేశాడు. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరిండచమేనని గౌరీశంకర్ పోలీసులకు తెలిపాడు.
కాగా, ఈ వివాదంపై స్పందించిన హీరో, నిర్మాత సతీష్ మాట్లాడుతూ.. సినిమా హక్కులు రాసిచ్చిన ఏడాది తర్వాత తాము షూటింగ్ పూర్తిచేసి ఈ నెల 24న విడుదల చేశామని చెప్పాడు. తనకు అసలు కోర్టు నుంచి స్టే ఆర్డరే రాలేదన్నాడు. హీరోయిన్ రష్మీ ఫోన్ చేసి స్టే విషయం చెప్పేవరకూ తనకు అసలు ఏమీ తెలియదని వ్యాఖ్యానించాడు. మామూలుగా ఎవరైనా రూ.50 లక్షలు రావాల్సి ఉంటే రోజుకు 2-3 సార్లు ఫోన్ చేస్తారనీ, కానీ ప్రసాద్ మాత్రం గత ఏడాది కాలంలో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని సతీష్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more