Producer Complaint On Rashmi Gautam's Movie అంతకుమించి చిత్ర హీరోపై కేసు నమోదు..

Producer complaint on rashmi gautam s movie

Producer, Gowri Shankar Prasad, Rashmi goutam, hero satish, contempt of court, financial crisis, title registration, kamala nagar, banjara hills police, movies, telugu cinema, entertainment

Producer Gowri Shankar Prasad has filed a complaint claiming that the film Anthaku Minchi was released without his approval, with Banjara Hills police officials.

వివాదంలో రష్మీ తాజా చిత్రం ‘అంతకు మించి’

Posted: 08/25/2018 05:31 PM IST
Producer complaint on rashmi gautam s movie

యాంకర్, నటి రష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అంతకు మించి’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో రష్మీ అందాల అరబోతలో కూడా అంతకు మించి ప్రేక్షకులకు కనువిందు చేసిందన్న వార్తలు ఓ వైపు చిత్రానికి నెగిటివ్ టాక్ గా మారుతున్న తరుణంలో నను సంప్రదించకుండానే చిత్రాన్ని విడుదల చేశారని ఓ నిర్మాత బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసి కేసు నమోదు చేయించాడు. ఈ చిత్రం హీరో, నిర్మాత సతీష్ జాయ్ తనను మోసం చేశాడని, కోర్టు ఆదేశాలను దిక్కరించాడని ఆయన పిర్యాదు చేశారు.

కేసు వివరాల్లోకి వెళ్లితే.. గౌరీశంకర్‌ ప్రసాద్‌ శ్రీకృష్ణ క్రియేషన్‌ బ్యానర్‌ పేరుతో ‘అంతకు మించి’ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే సినిమా ఆపేశాడు. దీంతో సతీష్ తానే హీరోగా ఉండి సినిమా పూర్తి చేస్తానని చెప్పి నిర్మాణ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభానికి ముందు గౌరీశంకర్ ఖర్చు పెట్టిన రూ.50 లక్షలను విడుదలకు ముందే చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.

సినిమా 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలని గౌరీశంకర్.. సతీష్‌ను అడిగాడు. సతీష్ ఇవ్వలేనని చెప్పడంతో గౌరీశంకర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు సినిమా విడుదలను ఆపేయాలని ఆదేశించింది. అయితే, సతీష్ కోర్టు ఆదేశాలు ఖాతరు చేయకుండా ముందుగా చెప్పిన తేదీ కంటే ముందే ఆగస్టు 24న (శుక్రవారం) సినిమా విడుదల చేశాడు. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరిండచమేనని గౌరీశంకర్ పోలీసులకు తెలిపాడు.

కాగా, ఈ వివాదంపై స్పందించిన హీరో, నిర్మాత సతీష్ మాట్లాడుతూ.. సినిమా హక్కులు రాసిచ్చిన ఏడాది తర్వాత తాము షూటింగ్ పూర్తిచేసి ఈ నెల 24న విడుదల చేశామని చెప్పాడు. తనకు అసలు కోర్టు నుంచి స్టే ఆర్డరే రాలేదన్నాడు. హీరోయిన్ రష్మీ ఫోన్ చేసి స్టే విషయం చెప్పేవరకూ తనకు అసలు ఏమీ తెలియదని వ్యాఖ్యానించాడు. మామూలుగా ఎవరైనా రూ.50 లక్షలు రావాల్సి ఉంటే రోజుకు 2-3 సార్లు ఫోన్ చేస్తారనీ, కానీ ప్రసాద్ మాత్రం గత ఏడాది కాలంలో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని సతీష్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles