అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర చాలా రోజుల తరువాత రూ. 50 వేల దిగువకు వచ్చింది. అమెరికా డాలర్ బలపడుతూ రావడం, ఆరు వారాల గరిష్ఠానికి డాలర్ చేరడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ వారంలో వరుసగా నాలుగు రోజులుగా పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2500 మేర తగ్గింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో 0.3శాతం మేర తగ్గిన ఔన్సు బంగారం ధరల 1858 డాలర్లకు జారింది, ఇక క్రితం రోజున తన దారి వేరని పెరిగిన వెండి కూడా ఇవాళ పడిపోయింది, అంతర్జాయంగా 2.8శాతం మేర ధర కుదించుకుపోయిన ఔన్సు వెండి ధర 22.23 డాలర్లకు చేరింది.
ఎంసీఎక్స్ లో అక్టోబర్ ఫ్యూచర్స్ బంగారం ధర ఇవాళ. 405 తగ్గి రూ. 49,293కు చేరుకుంది. ఇదే సమయంలో డిసెంబర్ ఫ్యూచర్స్ కు సంబంధించి, వెండి ధర కిలోకు రూ. 1,890 పడిపోయి రూ. 59,323కు చేరుకుంది. ఇక స్పాట్ మార్కెట్లో ఓ దశలో వెండి ధర రూ. 56,710 వరకూ దిగజారింది, ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1.9 శాతం పడిపోయి రూ. 950 మేర తగ్గగా, మరోవైపపు వెండి ధర 4.5 శాతం పతనమై కిలోకు రూ. 2700 మేర దిగజారింది. ఇటు దేశీయంగా కూడా బంగారానికి డిమాండ్ పెద్దగా లేకపోవడంతో బంగారం విక్రయాలు పెద్దగా సాగడం లేదు.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more