దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.57,697 (ఆన్- రోడ్ పుణె). సాథీ డెలివరీలను అక్టోబరు రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. 48-వోల్ట్ 26ఏహెచ్ లిథియం-ఐయాన్ బ్యాటరీ కలిగిన ఈ మోపెడ్ ఒక్కసారి ఛార్జింగ్తో 60- 70 కి.మీ మైలేజీని అందిస్తుంది.
ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి 3-4 గంటల సమయం పడుతుంది. పుణెలోని చకన్ ప్లాంట్లో దీన్ని తయారు చేయనున్నారు. వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ వ్యాపార సెగ్మెంట్ ను టార్గెట్ గా చేసుకుని టెక్నో ఎలక్ట్రా తమ ద్విచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సందర్బంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ భూట్రా మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లు అందుబాటులో వున్న అన్ని రకాల ద్విచక్రవాహనాల ధరలకు దూరంగా కస్టమర్లకు అందుబాటు ధరలో తమ వాహనాలు వుంటాయని చెప్పారు, ఇక బ్యాటరీ లైప్ పరంగాను అధికంగా మన్నుతుందని దీంతో కస్టమర్లు తమ విలువైన డబ్బును కూడా ఆదా చేసుకుంటారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more