రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ముంబైలో జరిగిన 43వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన కుటుంబసభ్యులు, వ్యాపార భాగస్వాములు, షేర్ హోల్డర్లు హాజరయ్యారైన ఈ సమావేశ:లో ఆయన రిలయన్స్ తీసుకువచ్చే అదునాతన సాంకేతికతతో కూడిన పరికరాలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా, కుమారుడు ఆకాశ్ అంబానీలు వీటికి సంబంధించిన వివరాలను వివరించారు.
జియో గ్లాస్ లో రియాలిటీ హెడ్ సెట్ ఉంటుంది. దీని ద్వారా వర్చువల్ ఇమేజెస్ ను చూడవచ్చు. దీని బరువు 75 గ్రాములు ఉంటుంది. సింగిల్ కేబుల్ కనెక్షన్ ఉంటుంది. దీని ద్వారా మొబైల్ కు కనెక్ట్ కావచ్చు. ఇప్పటికే 25 యాప్స్ ను ఇందులో ఇన్స్టాల్ చేసినట్టు తెలిపారు. వీడియో మీటింగ్స్ కు కూడా ఈ గ్లాసులు అనువుగా ఉంటాయి. విద్యార్థులకు కూడా అ గ్లాసులు చాలా ఉపకరిస్తాయి. చారిత్రక ప్రదేశాలతో పాటు వివిధ అంశాలను వర్చువల్ గా చూస్తూ పాఠాలను నేర్చుకోవచ్చు. త్రీడీని కూడా ఈ గ్లాస్ సపోర్ట్ చేస్తుంది. జియో టీవీ ప్లస్ ను కూడా ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ తదితర పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఇందులో ఉన్నాయి. వాయిస్ సర్చ్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. వినియోగదారులకు ఇంటి వద్దకే నాణ్యమైన సరుకులను అందజేయడానికి జియోమార్ట్ ను తీసుకొస్తున్నట్టు ఈషా అంబానీ తెలిపారు. కస్టమర్లు, కిరాణా షాపు యజమానులు, ఉత్పత్తిదారులను అనుసంధానం చేయడం... రిలయన్స్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ను నలుమూలలకు తీసుకెళ్లడం అనే రెండు పిల్లర్ల ఆధారంగా జియో మార్ట్ పని చేస్తుందని చెప్పారు. జియో మార్ట్ ద్వారా తొలి ఆర్డర్ చేసిన వారికి మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 09 | కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలాడిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. క్రయ విక్రయాలు జరగకపోవడంతో కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మొన్నటి వరకు దేశాలన్నీ లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా... Read more