ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ భారీ పెట్టుబడులను పెట్టనుంది. జియో ప్లాట్ పామ్స్ లో 9.99శాతం వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. దీని విలువ రూ.43,574 కోట్లు. ఈ మేరకు ఇరు సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. తాజా వాటా కొనుగోలుతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఫేస్బుక్ నిలవనుంది. భారత్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. 2016లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2016 నుంచి నాలుగేళ్ల కాలంలో 38.8 కోట్ల వినియోగదారుల్ని తన కస్టమర్లుగా మార్చుకుంది.
‘‘భారత్లోని చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనివ్వాలన్నదే మా లక్ష్యం. ముఖ్యంగా దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఆరు కోట్ల చిన్న తరహా వ్యాపారాలకు అండగా నిలవాలని అనుకుంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారిని ఏకం చేయాలనుకుంటున్నాం. కరోనా సంక్షోభం తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, దానికి జియో, ఫేస్ బుక్ బంధం బాటలు వేస్తుందని భావిస్తున్నాం’’ అని రిలయన్స్ ఈ సందర్భంగా పేర్కొంది.
భారత్లో డిజిటల్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని దీనిలో భాగం కావాలన్న లక్ష్యంతోనే జియోతో జతకడుతున్నామని ఫేస్బుక్ వెల్లడించింది. ఈ బంధం భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా దూసుకెళ్లేందుకు.. ప్రజలకు మెరుగైన వసతుల్ని అందించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు మరింత సమర్థంగా పనిచేసేలా మార్గాలు రూపొందిస్తామని తెలిపింది. ప్రతిభగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారత్ నిలయంగా ఉందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more