పసిడి పరుగుకు ఇవాళ అడ్డుకట్ట పడింది. నిన్న భారీగా పెరిగిన ధరలు ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా బంగారం వెండి ధరలు కిందకు దిగివచ్చాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో బుధవారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.25 శాతం తగ్గుదలతో రూ.37,920కు క్షీణించింది. ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ఇప్పుడు పసిడి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది.
పసిడి బాటలోనే పేదల ఆభరణంగా వర్థిల్లుతున్న వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.6 శాతం తగ్గుదలతో రూ.47,075కు క్షీణించింది. వెండి ధర ఈ నెల ప్రారంభంలో రూ.51,489 గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. దీంతో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ.4,400 పతనమైంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. పసిడి ధర ఔన్స్కు 1,500 డాలర్లకు పైనే కదలాడుతోంది.
అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల ప్రకటన కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. ఈ రోజు అమెరికా ఫెడ్ పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించొచ్చనే అంచనాలున్నాయి. ఇక అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.4 శాతం క్షీణతతో 17.93 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో సెప్టెంబర్ నెల ప్రారంభంలో బంగారం ధర ఆరేళ్ల గరిష్ట స్థాయిని తాకాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు వంటి పలు అంశాలు ఇందుకు కారణంగా నిలిచాయి.
ధరల పెరుగుదలతో దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గింది. ఆగస్ట్ నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 60 శాతానికి పైగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 తగ్గుదలతో రూ.39,500కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా కేవలం రూ.10 తగ్గుదలతో రూ.36,250కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.35 తగ్గుదలతో రూ.48,765కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,100 వద్ద స్థిరంగా కొనసాగింది. అదేబాటలో 22 క్యారెట్ల పసిడి ధర కొనసాగింది. ఇకపోతే కేజీ వెండి ధర మాత్రం తగ్గింది. రూ.35 తగ్గుదలతో రూ.48,765 పడిపోయింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more