దాదాపు 12, 700 కోట్ల స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ భారత్ వచ్చేందుకు తన డిమాండ్ ను వినిపిస్తున్నాడు. తన పాస్ పోర్టు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే తాను భారత్ కు వచ్చేందుకు సిద్ధమని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ కు తెలియజేశాడు. ఇదే విషయాన్ని కోర్టు ప్రివేన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కోర్టుకు గురువారం తెలియజేసింది.
మోహుల్ చోక్సీ గీతాంజలి జెమ్స్కి ప్రమోటర్. పీఎన్ బీ భారీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, మెహుల్ లు విదేశాలకు చెక్కేశారు. అనంతరం స్కాం వెలుగులోకి రావడం, భారత్లో వీరి సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు దాడులు జరపడం, నీరవ్, మెహుల్ పాస్పోర్టులు రద్దవడం వంటివన్నీ జరిగాయి. అతనికి వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీచేయమని, ఈడీ కౌన్సిల్ హిటెన్ వెంగోకర్ కోరారు. చౌక్సి డిమాండ్ను తోసిపుచ్చిన వెంగోకర్, పాస్పోర్టు రద్దుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినవసరం లేదని, భారత్కు తిరిగి రావడానికి తాత్కాలిక ప్రయాణ అనుమతి చాలని పేర్కొన్నారు.
ఇదే ఆదేశాలను శుక్రవారం కోర్టు కూడా జారీచేయనుంది. అతని పేరుపై ఇప్పటికే మూడుసార్లు సమన్లు పంపినప్పటికీ, దర్యాప్తు సంస్థల ముందు అతను విచారణకు హాజరు కాలేదు. చౌక్సికి వ్యతిరేకంగా ఫిర్యాదు కూడా దాఖలైంది. పీఎన్బీ స్కాం నేపథ్యంలో మెహుల్ చౌక్సికి చెందిన 41 స్థిర ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. అతనికి వ్యతిరేకంగా బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీచేసింది. భారత్లో భారీ కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి, విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేంగా ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు పేరుతో దీన్ని పాస్ చేసింది. ఈ బిల్లు ద్వారా విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారుల బినామీ ఆస్తులపై చర్యలు తీసుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more