సందర్భమేదైనా.. దానిని తమ ఉత్సత్తుల విక్రయానికి వినియోగించుకోవాలని ప్రస్తుతం మార్కెట్లోని అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో శివరాత్రి సందర్భంగా.. అంతకుమించి వాలెంటన్స్ డే సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమేజాన్ లో ‘శామ్ సంగ్ హ్యాపీ అవర్స్ సేల్’ నిర్వహిస్తోంది. లవర్స్ డే రోజున ప్రేమలో మునిగిన యువతీ యువకులు పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకోనున్న నేపథ్యంలో సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ హ్యాపీ అవర్స్ పేరుతో తమ ఉత్పత్తులను ప్రేమికుల ముందుకు తీసుకువచ్చింది.
హ్యాపీ అవర్స్ విక్రయాలలో భాగంగా పలు రకాల సామ్ సంగ్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు, పలు అపర్లను కూడా ప్రకటించింది. దీనికి తోడు పలు మైబైల్ ఫోన్ల విక్రయాలపై క్యాష్ బ్యాక్ లు, నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లను ప్రకటించింది. గెలాక్సీ 8 ను ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ తో ఎక్చేంజ్ చేసుకుంటే మరో రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ సహా అన్ని ప్రముఖ క్రెడిట్ కార్డులపై వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తోంది.
గెలాక్సీ ఆన్ 7ప్రైమ్ ధర రూ.12,990 కాగా, బజాజ్ ఈఎంఐ కార్డు, ఇతర క్రెడిట్ కార్డులతో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొంటే రూ.1,000 తగ్గుతుంది. గెలాక్సీ ఆన్5ప్రో రూ.1,000, ఆన్ 7ప్రోపై రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. దీంతో తగ్గింపు అనంతరం ఆన్ 5 ప్రోను రూ.6,990కు, ఆన్7ప్రోను రూ.7,490కు సొంతం చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ కస్టమర్లకు కూడా ఆఫర్లున్నాయి. గెలాక్సీ జే2, గెలాక్సీ జే7ప్రో, గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్ పై రూ.1,500 వరకు ఎయిర్ టెల్ కస్టమర్లు క్యాష్ బ్యాక్ లభించనుందని అమేజాన్ సంస్థ పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more