భారతీయ మ్కారెట్లో రికార్డు స్థాయి అమ్మాకాలతో తనదైన ముద్రను వేసుకుంటూ దూసుకెళ్లున్న చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ.. రెడ్మి నోట్4 తో స్మార్ ఫోన్ విక్రయాలలో ఇప్పటికే ప్రభంజనాన్ని సృష్టించింది. దీంతో మంచి ఊపు మీదున్న షియోమి సంస్థ మరో కొత్త మోడల్ ను భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది. ‘దేశ్ కా స్మార్ట్ ఫోన్’ పేరుతో ‘రెడ్మి 5ఏ’ మొబైల్ ను రూ.5వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గురువారం జరిగిన ఈ ఫోన్ విడుదల కార్యక్రమంలో ధర, ఫీచర్లను రెడ్మి ఇండియా వెల్లడించింది.
‘‘స్మార్ట్ఫోన్ ఇండస్ట్రీ చరిత్రలో షియోమి ఇండియా ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనుంది. అందులో భాగంగానే తొలి 50లక్షల రెడ్ మి 5ఏ(2జీబీ+16బీజీ)ను రూ.4,999కే అందించనున్నాం’’ అని రెడ్ మి ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది. డిసెంబర్ 7 మధ్యాహ్నం 12గంటలకు భారత ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో తొలి సేల్ ప్రారంభం కానుందని వెల్లడించింది.
రెడ్మి 5ఏ స్పెసిఫికేషన్లు..
* 5 ఇంచుల హెచ్ డీ టచ్ స్ర్కీన్
* స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
* 2జీబీ ర్యామ్
* 16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు పెంచుకునే సదుపాయం
* 5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు
* ఆండ్రాయిడ్ నోగట్, ఎంఐయూఐ 9 వెర్షన్
* మెమొరీకార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్
* 3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more