భారతీయ టెలికాం రంగం రారాజు భారతీ ఎయిర్ టెల్ తన ప్రత్యర్థిగా దూసుకెళ్లున్న రిలయన్స్ జియోకు దిమ్మతిరిగే షాకిచ్చింది. రిలయన్స్ జియో ఫిచర్ ఫోన్ ఇస్తానన్న ధరలోనే ఏకంగా స్మార్ట్ ఫోన్ ను అందచేస్తుంది ఎయిర్ టెల్. ఇప్పటికే తన ఫీచర్డ్ ఫోన్ ను ప్రకటించిన ఎయిర్ టెల్ ఇవాళ మరో రెండు కొత్త ఆండ్రాయిడ్ ఆధారిత 4జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. హ్యాండ్సెట్ తయారీదారి కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంలో ఈ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది.
''ఏ1 ఇండియన్'', ''ఏ41 పవర్'' పేర్లతో ఈ రెండు స్మార్ట్ఫోన్లను ఫీచర్ ఫోన్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ1 ఇండియన్ 4జీ స్మార్ట్ఫోన్ను రూ.1,799కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట చిల్లర ధర 4,390 రూపాయలు. అదేవిధంగా ఏ41 పవర్ 4జీ స్మార్ట్ఫోన్ను 1,849 రూపాయలకు విక్రయానికి తెస్తోంది. దీని చిల్లర గరిష్ట ధర కూడా 4,290 రూపాయలు. జియో ఫీచర్ ఫోన్కు గట్టి పోటీగా ఈ రెండు స్మార్ట్ఫోన్లను రెండు వేల రూపాయల తక్కువకు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏ1 ఇండియన్ ఫీచర్లు:-
4 అంగుళాల డిస్ప్లే
1.1గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
32జీబీ వరకు విస్తరణ మెమరీ
డ్యూయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
1500ఎంఏహెచ్ బ్యాటరీ
3.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఏ41 స్మార్ట్ఫోన్ ఫీచర్లు:-
4 అంగుళాల డిస్ప్లే
1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
32జీబీ వరకు విస్తరణ మెమరీ
డ్యూయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
2,300ఎంఏహెచ్ బ్యాటరీ
2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more