రిలయన్స్ జియో విడుదల చేయనున్న సరికొత్త 4జీ ఫోన్ ను భారతీయులకు ఉచితంగా అందించనున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఒక స్మార్ట్ ఫోన్ ఎంట్రీ లెవల్ ధర రూ. 3,500 నుంచి రూ. 4 వేలుగా ఉన్న వేళ, తాను ఇండియన్స్ కోసం ఉచితంగానే ఫోన్ ను అందిస్తానని అన్నారు. అయితే కొత్త 4జీ ఫోన్ ను పొందేందుకు రూ. 1500 డిపాజిట్ గా చెల్లించాల్సి వుంటుందని, దీన్ని మూడేళ్ల తరువాత పూర్తిగా వెనక్కు ఇచ్చేస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. భారతీయులందరికీ ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని, ఆగస్టు 15, 2017 భారతదేశ చరిత్రలో డిజిటల్ యుగాన్ని సరికొత్త మైలురాయికి చేరుస్తుందని ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా మరో అద్భుత ఆవిష్కరణ కూడా జరిగింది. జియో ఫోన్ టీవీ-కేబుల్ ను విడుదల చేస్తున్నట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు. కేవలం స్మార్ట్ టీవీలకు మాత్రమే కాకుండా, అన్ని రకాల టీవీలకూ ఇది పని చేస్తుందని, ఈ కేబుల్ ద్వారా స్మార్ట్ ఫోన్ డేటాతో టీవీ కార్యక్రమాలను, నచ్చిన సమయంలో నచ్చిన సినిమాలను, పాటలను టీవీ స్క్రీన్ పై వీక్షించవచ్చని, లైవ్ కార్యక్రమాలను చూడవచ్చని అన్నారు. నెలకు రూ. 309 చెల్లించడం ద్వారా ఈ ప్యాక్ ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ లో ఉన్నవారు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు టీవీలో కార్యక్రమాలను చూడవచ్చని అన్నారు.
రిలయన్స్ జియో ఉన్నంత కాలం వాయిస్ కాల్ కు ఒక్క పైసా కూడా వసూలు చేయబోనని ఆయన హామీ ఇచ్చారు. జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత రోజుకు 250 కోట్ల నిమిషాల కాల్స్ ను ఉచితంగా అందించామని, ఇకపైనా అలాగే జరుగుతుందని అన్నారు. అధునాతన సాంకేతికత దగ్గర చేస్తున్న సౌకర్యాలను తాను మారుమూల గ్రామాల ప్రజలకు అందిస్తానని స్పష్టం చేశారు. నెలకు 125 కోట్ల గిగాబైట్ల డేటాను తాము అందిస్తున్నామని, 65 కోట్ల వీడియో నిమిషాలను స్ట్రీమింగ్ చేస్తున్నామని ముఖేష్ పేర్కొన్నారు. మొబైల్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను ఇండియా దాటేసిందని ప్రకటించేందుకు తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు.
పది నెలల క్రితం జియో మార్కెట్లోకి రాకముందు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవల విషయంలో 156వ స్థానంలో ఉన్న ఇండియా, ప్రస్తుతం తొలి స్థానానికి ఎదిగిందని ముఖేష్ ప్రకటించారు. మార్చి నుంచి డేటాకు నియమిత మొత్తాన్ని వసూలు చే్యడం ప్రారంభించిన తరువాత, అత్యధిక యూజర్లు పెయిడ్ కస్టమర్లుగా మారారని, ఇప్పుడు 10 కోట్లకు పైగా పెయిడ్ కస్టమర్లకు తాము సేవలందిస్తున్నామని తెలిపారు. ఎక్కువ మంది తామందిస్తున్న రూ. 309 ప్లాన్ తీసుకుంటున్నారని తెలిపారు. జియో ప్రైమ్ సభ్యులకు ధన్ ధనాధన్ ప్లాన్ ను కొనసాగిస్తామని అన్నారు. ముఖేష్ అంబానీ ప్రసంగం కొనసాగుతోంది.
కాగా, తన సంస్థ సాధించిన ప్రగతిని వివరిస్తూ ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సంస్థను స్థాపించిన తన తండ్రిని తలచుకున్నారు. తన తల్లి సహకారంతో ఆయన వేసిన పునాది ఈనాడు ఇంతింతైవటుడింతై అన్నట్టు ఎదిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను తల్చుకున్న ఆయన ఒక్క నిమిషం పాటు మాటలు అందక మౌనం దాల్చారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఉబికి వస్తున్న భావాలను దిగమింగి తన ప్రసంగం కొనసాగించారు. ఈ ఏజీఎంకు ముఖేష్ సతీమణి నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్, కుమారుడు, కుమార్తె సహా పలువురు ప్రముఖులు, వీఐపీలు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more