ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను అర్జించాయి, క్రితం వారాంతంలో చవిచూసిన నష్టాల నుంచి త్వరగానే తేరుకున్న దేశీయ సూచీలు లాభాలను గడించాయి. ఈ నేపథ్యంలో అటు సెన్సెక్స సహా ఇటు నిఫ్టీ కూడా అర శాతం మేర లాభాలను గడించాయి. ఉదయం మార్కెట్లు స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. ఆ తరువాత చివరి క్షణంలో వచ్చిన లాభాలు మార్కెట్లను లాభాల బాటలో పయనింపజేశాయి. ఫలితంగా సెన్సెక్స్ 25 వేల 650 మార్కుకు ఎగువన, అటు నిఫ్టీ కూడా బెంచ్ మార్క్ 7850 మార్కుకు ఎగువకు చేరుకున్నాయి.
ఫలితంగా మార్కెట్టు ముగిసే సమయానికి మార్కెట్లు దేశీయ సూచీలు లాభాలను గడించాయి. సెన్సెక్స్ 164 పాయింట్ల లాభంతో 25 వేల 653 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ
కూడా 46 పాయింట్ల లాభంతో 7 వేల 860 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది, మొత్తంగా 2,739 కంపెనీల షేర్లు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,302 కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించగా, 1,263 కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. కాగా 174 కంపెనీల షేర్లు తటస్థంగా నిలిచాయి.
ఇవాళ్లి ట్రేడింగ్ లో అటో, బ్యాంకింగ్ నిఫ్టీ, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, ఐటీ, మెటల్స్, టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాలను అర్జించగా, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, అయిల్ అండ్ గ్యాస్, బ్యాంకెక్స్, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు నష్టాలను చవిచూశాయి. కాగా, ఐటీ, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమల సూచీలతో పాటు ఎఫ్ ఎం జీ సీ, సూచీలు స్వల్ప నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్, ఇన్ ఫ్రా టెల్, బోష్ లిమిటెడ్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఇన్ఫ్రాటెల్ తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, సిప్లా, అదానీ పోర్ట్స్, ఐడియా సెల్యులార్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more