దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిసాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రారంభమైన లాభాల మద్యలో ఒక రోజు మినహా మళ్లీ అందుకున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు కేంద్రం చమురు రంగంలో తీసుకువచ్చిన సవరణలతో అప్పటి వరకు నష్టాల బాటలో పయనించిన మార్కెట్లు, మద్యాహ్నం నుంచి లాభాలను అందుకున్నాయి, ముఖ్యంగా ఐరోపా మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల పవనాలు మార్కెట్లను లాభాలలోకి తీసుకెళ్లాయి.
సెషన్ ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ సూచీలు స్వల్ప లాభాలు నమోదు చేసుకున్నాయి. ఇవాళ్లి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 94.65 పాయింట్లు పెరిగి 0.38 శాతం లాభంతో 24,717.99 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 24.05 పాయింట్లు పెరిగి 0.32 శాతం లాభంతో 7,510.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.08 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.16 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి.
కెయిర్న్ ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ పోర్ట్స్, లుపిన్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.
బీఎస్ఈలో మొత్తం 2,725 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,100 కంపెనీలు లాభాల్లోను, 1,464 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. గురువారం నాడు రూ. 91,64,974 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,82,859 కోట్లకు పెరిగింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more