Profit booking drags Sensex 171 pts, Nifty below 7,500 Mark

Sensex nifty end in red ahead of ecb meet

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

The market erased all its previous day's gains Thursday on profit booking in banks, FMCG, technology and infra stocks.

నష్టాల్లో మార్కెట్లు.. 7500 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 03/10/2016 05:42 PM IST
Sensex nifty end in red ahead of ecb meet

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అరు రోజుల నుంచి అనుభవిస్తున్న లాభాలకు ఇవాళ బ్రేకులు పడ్డాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచి మార్కెట్లు భారీ లాభాలను నమోదు తచేసుకుంటున్న మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు కేంద్ర బడ్జెట్ తో త్వరలో రిజర్వు బ్యాంకు సమీక్షించనున్న ద్రవ్య పరపతి విధానంలో వడ్డీ రేట్లను సవరించనున్నారని గత వారం రో్జులుగా ఎగసిన మార్కెట్లు ఇవాళ నెలవంక చూశాయి.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు తోడు, దేశవాళీ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బెంచ్ మార్క్ సూచికలు నష్టపోయాయి. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్ద మొదలైన సెన్సెక్స్ ట్రేడింగ్, ఆపై అమ్మకాల ఒత్తిడి కారణంగా 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆపై మధ్యాహ్నం తరువాత కొంత రికవరీ కనిపించినా నష్టాలు మాత్రం తప్పలేదు. ఈ నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు ఒత్తడి చేయడంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలలో ముగిసాయి.  సెన్సెక్స్‌ 170 పాయింట్లు నష్టపోయి 24,623 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 7,486 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.01 వద్ద కొనసాగుతోంది.

బీఎస్ఈలో మొత్తం 2,748 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,197 కంపెనీలు లాభాల్లోను, 1,401 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాడు రూ. 92,04,800 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,64,974 కోట్లకు తగ్గింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో కెయిర్న్‌ ఇండియా సంస్థ షేర్లు అత్యధికంగా లాభపడగా, దానితోపాటు హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్‌, మారుతీ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే రిలయన్స్‌ సంస్థ షేర్లు అత్యధికంగా  నష్టపోగా, అదే బాటలో బీహెచ్‌ఈఎల్‌, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సంస్థల షేర్లు కూడా నడిచాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles