Bulls ahead of I-Day: Nifty ends above 8500, Sensex up 518 pts; PSU banks lead

Bulls ahead of i day nifty ends above 8500

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The Sensex was up 517.78 points at 28067.31 and the Nifty was up 162.70 points at 8518.55. About 1795 shares have advanced, 1057 shares declined, and 129 shares are unchanged.

వారాంతంలో మార్కెట్లకు భారీ లాభాలు.. 8500 మార్కు దాటిన నిఫ్టీ

Posted: 08/14/2015 10:10 PM IST
Bulls ahead of i day nifty ends above 8500

దేశ 69వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో మార్కట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. వారాంతంలో బ్యాంకింగ్ రంగ షేర్లతో పాటు అటో, ఐటీ, ఫార్మా సూచీలు అత్యధిక లాభాలను సొంతం చేసుకున్నాయి.  ఆర్థిక సంక్షోభాన్ని భర్తి చేసుకునేందుకు  చైనా తన కరెన్సీ యువాన్ విలువను మరింత తగ్గించిన నేపథ్యంలో యావత్ ప్రపంచ మార్కెట్లు పతనాన్ని చవిచూసినా.. భారతీయ సూచీలు మాత్రం లాభాలను ఆర్జించాయి. దానికి తోడు ఇండిపెండెన్స్ డే సెంటిమెంట్ కూడా ఫలించడంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ముగియడంతో ఇన్నాళ్లు కీలక బిల్లు అమోదంపై దోబుచులాడిన మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను ఆర్జించాయి.

దీనికి తోడు మెండి రుణాలను సేకరణతో పాటు జాతీయ బ్యాంకుల వ్యాపారాభివృద్దికి క్యాపిటల్ ఇన్ ఫ్యూషన్ సహా నూతన నియామకాల చేపట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేస్తారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు లాభాల బాటలో పరుగులు పెట్టాయి. ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే దేశీయ మార్కెట్లు లాభాల బాటలో నడిచాయి. నిన్న స్వల్ప లాభాలను ఆర్జించిన మార్కెట్లు ఇవాళ ఉదయం నుంచి కూడా సానుకూల పవనాల మధ్య లాభాలను అదిమిపట్టుకున్నాయి. ఉదయం 100 పాయింట్ల లాభంతో లాభాలలో దూసుకెళ్లిన సెన్సెక్స్, మధ్యాహ్నం 12 గంటల సమాయానికి 400 పాయింట్లను ఆర్జించింది. అటు నిఫ్టీ కూడా 8500 మార్కును తిరిగి రాబట్టుకుంది.

సెంటిమెంట్ల మధ్య మార్కెట్ లో లాభాలు అంతకంతకు పెరుగతూనే ముగిశాయి.. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి 518 పాయింట్లు లాభాన్ని ఆర్జించి సెన్సెక్స్ 28 వేల 67 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 163 పాయింట్ల లాభంతో 8519 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ నేపథ్యంలో ఇవాళ 1795 సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, 1057 సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 129 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, అటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మద్య తరహా పరిశ్రమల సూచీలు కూడా భారీ లాభాలను ఆర్జించగా, మిగిలిన అన్ని సూచీలు స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఏ ఒక్క సూచీ కూడా ఇవాళ నష్టాల బాటలో పయనించలేదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  RBI  

Other Articles