Sensex tanks 427 pts sees biggest weekly loss in 2015

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

Sensex tanks 427 pts, sees biggest weekly loss in 2015

భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. ఏడాదిలోనే ప్రథమం

Posted: 03/13/2015 09:12 PM IST
Sensex tanks 427 pts sees biggest weekly loss in 2015

భారత్ అంచానాలకు మించి అభివృద్దిలో శరవేగంగా రాణిస్తుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెలువరించిన సంకేతాలతో మూడు రోజుల నష్టాల నుంచి లాభాలభాటలో పయనించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలను మూటగట్టకున్నాయి. ఈ ఏడాదిలోనే ఇంతటి భారీ నష్టాన్ని చవిచూసింది. ద్రవ్యోల్భణం కారణంగా వడ్డీ రేటు తగ్గింపు నిలిచిపోతుందన్న వార్తల నేపథ్యంలో మదుపు దారులు విక్రయాలకు మొగ్గుచూపడంతో మార్కట్లు నష్టాల బాటలో పయనించాయి. ఇవాళ రాజ్యసభలో ఇన్సూరెస్సు రంగంలో విదేశీ పెట్టబడులకు అనుమతిస్తూ పెట్టిన బిల్లు అమోదం లభించడంతో ఉదయం మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభంలో ఆర్జించిన 253 పాయింట్ల లాభంతో పయనించిన మార్కెట్లు.. ఆ తరువాత ద్రవ్యోల్భణం వార్తల నేపథ్యంలో నష్టాలను చవిచూశాయి.

ఈ నేపథ్యంలో సెన్సెక్స్ సెన్సెక్ 427 పాయింట్ల నష్టంలో కొనసాగి.. 28,503 వద్ద ముగియగా, 128 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 8,647 వద్ద ముగిసింది. డీఎల్ఎఫ్, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్ఝీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలు ఆర్జించాయి. జిందాల్ స్టీల్, బిహెచ్ఇఎల్, కెయిర్న్ ఇండియా, లార్సెన్, అంబుజా తదితర షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 62.96 ఉంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles