Ramayapatnam likely to be 2nd big port in state

Ramayapatnam 2nd big port in state, Ramayapatnam port, Ramayapatnam port finalised, Prakasam district, shipyard, ship port, big port in india.

Ramayapatnam in Prakasam district has more or less been finalised as the site for the second major port in the state. An official announcement is expected any time in this month.

Ramayapatnam likely to be 2nd big port in state.png

Posted: 11/16/2012 03:34 PM IST
Ramayapatnam likely to be 2nd big port in state

Ramayapatnamప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద షిప్‌యార్డు నిర్మాణానికి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇది దేశంలోనే 14వ అతిపెద్ద షిప్‌యార్డు అవుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇదే అతిపెద్ద షిప్‌యార్డు కానున్నది. భూసేకరణ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. గతంలో పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ఐదో నంబరు జాతీయ రహదారికి 15 కి.మీ. దూరంలో ఉన్న తీరంలోని రామాయపట్నంలో షిప్‌యార్డుకు ప్రతిపాదనలు చేశారు.

రామాయపట్నం వద్ద నిర్మించబోయే షిప్‌యార్డులో ప్రధానంగా నౌకల నిర్మాణం, మరమ్మతుల యూనిట్లతో పాటు ఫిషింగ్ హార్బర్ ఉంటాయి. ప్రభుత్వరంగంలో ఇలాంటి షిప్‌యార్డులు కొచ్చిన్, ముంబై వంటి నగరాల్లోనే ఉన్నాయి. ఓడల నిర్మాణం, మరమ్మతుల యూనిట్ల ద్వారా సుమారు పదివేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. తీరం నుంచి రైల్వే ట్రాక్‌వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు యార్డు విస్తరిస్తుంది. షిప్‌యార్డు నిర్మాణానికి రూ. 10 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా. ఇందులో రూ. మూడువేల కోట్లు పునరావాసానికి ఖర్చుచేస్తారు. మిగిలిన నిధులను నౌకానిర్మాణ కేంద్రానికి కేటాయిస్తారు.షిప్‌యార్డులో మొత్తం ఆరు బెర్త్‌లు ఏర్పాటు చేయనున్నారు.షిప్‌యార్డుకు సుమారు ఐదువేల ఎకరాలు అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు.

గతంలో పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ఇదే విషయాన్ని కలెక్టర్‌కు తెలిపారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, గ్రామాలు ఉన్నా అన్నింటినీ కలిపి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తీరప్రాంతం కావడం వల్ల ఎక్కువ భూమి ప్రభుత్వానికి సంబంధించినదే ఉంది. ఇందులో అటవీ భూములు కూడా ఉన్నాయి.జిల్లా నుంచి గ్రానైట్ రాయిని ప్రధానంగా ఎగుమతి చేసేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. బియ్యం, మామిడి, సపోటాలు, పలకలు, ఐరన్ ఓర్‌ను కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు. తీరప్రాంతం కావడం వల్ల ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రాసెస్ చేసిన సముద్ర ఉత్పత్తులను ఇప్పటివరకు చెన్నైకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి రేవు ద్వారా ఎగుమతి చేస్తున్నారు. రామాయపట్నంలో రేవు నిర్మాణంతో రవాణా భారం తగ్గుతుంది. రసాయన ఎరువులు, కందిపప్పు, క్రూడాయిల్ వంటి సరుకుల దిగుమతి రామాయపట్నంలోనే జరుగుతుంది. ఇప్పటివరకు ఇవి కాకినాడ పోర్టుకు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Online shopping yet to pick up in india survey
India to grow fastest till 2060  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles