ప్రకృతిలో ఎన్నోరకాల పువ్వులు పూస్తాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే పూజకు పనికొస్తాయి. అలాగే ప్రపంచంలో ఎందరో గాయకులు వున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే తమ మధుర కంఠంతో ప్రేక్షకులను మైమరపించి, అమరగాయకులుగా చిరకాలం వుండిపోతారు. అటువంటి వారిలో పద్మశ్రీ డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారు ఒకరు.
మన భారతదేశ చిత్ర పరిశ్రమలో పేరొందిన గాయకులలో పద్మశ్రీ డాక్టర్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంగారు ఒకరు. ఈయన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ , మళయాళ, హిందీ, తులు , ఒరియా, అస్సామీ, బడగ, సంస్కృతం, కొంకిణి, బెంగాలి, మరాఠీ, పంజాబీ, ఇంగ్లీష్ వంటి 11 భాషలలో కూడా తన గానస్వరాలను ప్రేక్షకులకు అందించి, ఎన్నో అభినందనలను, అవార్డు - రివార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే కొన్ని సినిమాలలో నటుడిగానూ, సంగీత దర్శకుడిగాను పనిచేసి ప్రేక్షకాభిమానుల మన్ననలను పొందారు. ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యంగారు తన స్వరాలతో అందరినీ మైమరపించి ‘‘పద్మశ్రీ’’ అవార్డును సంపాదించుకోగలిగారు. తెలుగువారు అభిమానంతో ఈయనను ‘‘బాలు’’ అని పిలుచుకుంటారు.
జననం - బాల్యం - విద్యాభ్యాసం :
బాలసుబ్రహ్మణ్యంగారు 1946వ సంవత్సరంలో జూన్ 4వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో నివాసం వుండే బ్రాహ్మణ దంపతులైన సాంబమూర్తి, శ్రీమతి శకుంతలకు జన్మించారు. ఈ దంపతులకు మొత్తం ఎనిమిది మంది సంతానం. అందులో ముగ్గురు కుమారులు కాగా, మిగతా ఐదుగురు కుమార్తెలు. ఇంతపెద్ద కుటుంబంలో జన్మించిన బాలుగారు రెండవ కుమారుడిగా జన్మించారు. బాలుగారి తండ్రి అయిన సాంబమూర్తిగారు గొప్ప పేరొందిన ఒక హరికథా పండితుడు.
బాలసుబ్రహ్మణ్యంగారికి తన బాల్యం నుంచే పాటలు పాడటంలో ఎంతో ఆసక్తి కలిగింది. దానిని ఆయన ఒక హాబీగా మార్చుకుని, నిత్యం పాడుకుంటూ వుండేవారు. తన చిన్నతనం నుంచే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని బహుమతులను కూడా సొంతం చేసుకున్నారు. తన బాల్య చదువు పూర్తికాగానే తండ్రి కోరిక మేరకు మద్రాసులో AMIE ఇంజనీరు కోర్సులో చేరి, పూర్తి చేశారు.
సినీ ప్రవేశం :
1964వ సంవత్సరంలో మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీలలో బాలసుబ్రహ్మణ్యంగారు పాల్గొన్నారు. దానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఘంటసాల, పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తిగారు బాలుగారి లేతగాత్రం విని పరవశించిపోయారు. దాంతో ఆయనకు ఆ పోటీలలో మొదటి బహుమానం వచ్చింది. అప్పటి సంగీత దర్శకుడయిన ఎస్.పీ.కోదండపాణిగారు బాలుగారి గాత్రం విని ముగ్ధుడయిపోయారు.
రెండేళ్ల తరువాత అంటే 1966వ సంవత్సరంలో కోదండపాణిగారు బాలుసుబ్రహ్మమణ్యంగారికి ఒక ఆహ్వానాన్ని పంపించారు. ఆ సమయంలో బాలుగారు తానే స్వయంగా రాసుకున్న ఒక పాటను వినిపించి తన ప్రతిభను చాటుకున్నారు. దాంతో ఆయనకు నటుడు, నిర్మాత అయిన పద్మనాభంగారు నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలో సినీగాయకునిగా అవకాశం వచ్చింది. కోదండపాణి అందించిన ఈ అవకాశానికి బాలుగారు ఆయనమీద వున్న భక్తతో తాను స్వయంగా నిర్మించిన ఆడియో ల్యాబ్ కు ‘‘కోదండపాణి ఆడియో ల్యాబ్స్’’ అని పేరు పెట్టుకున్నారు. ఈ విధంగా మొదలైన బాలుగారి స్వరం.. ఇప్పటికీ మన తెలుగువారు ఆస్వాదిస్తూనే వున్నారు.
40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన బాలసుబ్రహ్మణ్యంగారు 1981 ఫిబ్రవరి 8వ తేదీన ఒకేసారి 17 పాటలు పాడి ఒక కొత్త రికార్డ్ ను సృష్టించారు. అలాగే తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలను ఒక్కొక్క రోజున చొప్పున పాటలు పాడి తన ఘనతను చాటిచెప్పుకున్నారు. 45 సినిమాలలో నటించిన బాలుగారు ఎన్నో రకాల పాత్రలను ధరించారు. అనేక రకాల సీరియల్స్ లోనూ నటించి, తన విశ్వరూపాన్ని ప్రదర్శించుకున్నారు.
బాలుగారి విజయ ప్రస్థానం :
తరాలు మారినా, ఎందరో నటులు చిత్ర సీమకు పరిచయమైనా.. వారికి అనుగుణంగానే వారి హావభావాలకు, నటన శైలికి తగ్గట్టు పాటలను పాడి ప్రాణం పోశారు. తన గళంలో అభినయ ముద్రలను నింపి తెలుగుదనంలో వున్న స్వచ్ఛతను తెలిపారు. ఎందరో గాయకులు పరిచయమైనప్పటికీ ఈయనకు సాటిగా ఎవ్వరూ నిలబడలేకపోయారు. అందువల్లే అమరగాయకుడైన ఘంటసాల తరువాత మన తెలుగు సీమ పాటలకు వారసుడిగా బాలసుబ్రహ్మణ్యంగారు నిలిచారు.
అవార్డులు - రివార్డులు :
తన గళంతో, స్వరరాగాలతో అందరినీ మైమరిపించే బాలసుబ్రహ్మణ్యంగారికి 29 సార్లు నంది అవార్డులు, కలైమామణి, విశ్వగానయోగి, నాదనిధి, గానగంధర్వ వంటి బిరుదులను పొందారు. 1999వ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీవారు, 2009లో సత్యభామ యూనివర్సిటీవారు బాలుగారికి డాక్టరేట్ పట్టాతో గౌరవించారు. మన భారత ప్రభుత్వం తరుఫున 2001వ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ గారు గౌరవ పురస్కారమైన పద్మశ్రీ అవార్డును ఎంతో ఆదరంగా ప్రసాదించారు. అలాగే 2011వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఈయనకు అందించి, ఆయన గౌరవాన్ని మరింత పెంచేందుకు సహకరించింది.
మన తెలుగు చిత్రసీమలో గర్వించదగ్గ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు అయిన పద్మశ్రీ డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారికి ‘‘తెలుగువిశేష్’’ తరఫు నుంచి హార్థికపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more