గౌతమ బుద్ధుడు... ఈయన అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం ధరించిన ఏకవిశంతి అవతారాలలో గౌతమ బుద్దుడు ఒకడుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ నలుమూలల వ్యాపించిన అధర్మాన్ని, అవిశ్వాన్ని, మారణహోమాలను, మూఢనమ్మకాలను వైదొలగించేందుకు బౌద్ధ ధర్మాన్ని నిర్మించిన మూల కారకుడు ఈ గౌతమ బుద్ధుడు. ఆనాడు వున్న ఆధ్యాత్మిక గురువులలో ఈయనకు ప్రత్యేక స్థానం వుంది.
బుద్ధునికి సంబంధించిన జీవిత చరిత్ర, జనన - మరణాల వంటి విషయాలు ఇంతవరకు స్పష్టంగా తెలియరాలేదు. 20వ శతాబ్దపు చారిత్రకకారులు, శాస్త్ర నిపుణులు తమ పరిశోధనలు, శాస్త్రాల ఆధారంగా బుద్ధుడు క్రీ.పూ. 563 - 483 మధ్యకాలంలో జన్మించి వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. అలాగే 410 - 400 మధ్యకాలంలో ఆయన మరణం వుండచ్చునని భావిస్తున్నారు. అయితే ఈ లెక్కలపై ఎటువంటి ఖచ్చితమైన స్పష్టత మాత్రం రావడం లేదు.
ఇతనికి అర్కబంధువు, గౌతముడు, మాయాదేవీసుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడు, శౌద్ధోదని, సర్వార్థసిద్ధుడు, సిద్ధార్థుడు అనే ఇతర నామాలు కూడా వున్నాయి.
గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మాలను అవలంభిస్తున్న భక్తులందరి ద్వారా మహాబుద్ధిడిగా నిత్యం కీర్తించబడతాడు. ఈయనను శాక్యముని అని కూడా పిలుస్తారు. ఈయనకు సంబంధించిన ఆధ్యాత్మిక దేవాలయాలు, బౌద్ధ ధర్మాలు - శాస్త్రాలు, సంస్కృతీ - సంప్రదాయాలు ప్రపంచం నలుమూలల వ్యాపించి వున్నాయి. మొదట ఈయన బోధించినా ధర్మాలు అంతగా అమలులో రాకపోగా.. సుమారు 400 తరువాత త్రిపీటిక అనే పేరు మీద మూడు పీఠికలగా విభజించి, తరతరాలుగా పారాయణం చెందుతూ వ్యాపించాయి.
బుద్ధుని జీవిత చరిత్రను కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా నిర్ధారించుకోవచ్చు కానీ పూర్తి వివరాలను నిరూపించడం మాత్రం చాలా కష్టమే. బౌద్ధ సాహిత్యం ప్రకారం... బుద్ధుడు తన శిష్యులతో కలిసి ప్రతి సంవత్సరం నాలుగు బోధనలను ఆరచించుకునేవారు. బుద్ధుడు మరణించిన తరువాత అతని శిష్యులు అతని బోధనలను ప్రచారం చేయడానికి ఒక సంఘంగా ఏర్పడింది. తరువాత రానురాను ఆ సంఘాలు రెండుగా మారిపోయాయి. ఈ రెండు సంఘాలు వేర్వేరుగా బుద్ధుని బోధనలను విభజించి, అప్పటి బౌద్ధ భిక్షవులకు అప్పగించాయి. ఆ విధంగా బుద్ధుని బోధనలు, ఆయన జీవిత చరిత్ర ప్రస్తుత కాలంలో సంతరించుకున్నాయి.
బుద్ధుని జననం :
ప్రాచీన భారతదేశంలో కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో సిద్ధార్థుడు జన్మించాడు. సిద్ధార్థుడు పుట్టిన వెంటనే అతని తల్లి మరణించడంతో గౌతమి అనే మహిళ ఇతనిని పెంచి పోషించింది. బుద్ధుని తల్లి కొళియన్ దేశానికి రాకుమారి అయిన మహామాయాదేవి. ఒకనాడు బుద్ధుడు గర్భంలో వున్న సమయంలో మాయాదేవి ఒక ఆరు దంతాలు గల ఏనుగును తన కుడివైపు నుంచి గర్భంలోకి ప్రవేశించినట్లుగా స్వప్నం (కల) లో దర్శించుకుంది. ఆ సంఘటన జరిగిన 10 మాసాల తరువాత సిద్ధార్థుడు జన్మించాడు.
శాక్యవంశస్థుల ఆచారం ప్రకారం... గర్భవతిగా వున్న మాయాదేవి ప్రసవం కోసం తన తండ్రి ఇంటికి బయలుదేరగా.. మార్గమధ్యంలోనే లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం కింద ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇతను జన్మించిన కొద్దిరోజులలోనే మాయాదేవి చనిపోయిందని కొన్ని ఆధారాలు తెలుపుతున్నాయి. పుట్టిన మగబిడ్డకు సిద్ధార్థుడు అనే నామకరణం చేశారు. జన్మించిన ఐదవరోజునాడు అతని భవిష్యత్తు గురించి చెప్పమని తండ్రి శుద్ధోధనుడు, జ్యోతిష్కులకు అడగగా.. వారిలో నుంచి కౌండిన్యుడు అనే పండితుడు.. ‘‘సిద్ధార్థుడు భవిష్యత్తులో బౌద్ధమతాన్ని ప్రచురించి, బుద్ధుడు అవుతాడు’’ అని జ్యోస్యం చెబుతాడు.
వివాహ జీవితం :
తండ్రి అయిన శుద్ధోధనుడు తన కుమారుడయిన సిద్ధార్థునికి ఎటువంటి కష్టసుఖాలు, బాధలు తెలియనివ్వకుండా, విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. అలా అతనికి 16 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు యశోధర అనే అమ్మాయితో వివామమయింది. వీరిద్దరికి రాహులుడు అనే ఒక కుమారుడు కూడా వున్నాడు. బయటి ప్రపంచంలో జరుగుతున్న తాత్విక విషయాలు, ఈతి బాధలు తెలియకుండా బుద్ధుడు తనకు 29 ఏళ్లు వచ్చేంతవరకు సంసార జీవితాన్ని సుఖంగా అనుభవించాడు.
సన్యాసి జీవితం :
ఒకరోజు సిద్ధార్థుడు తన రథసారథి అయిన ఛన్న (చెన్నుడు)తో కలిసి బయటి ప్రపంచాన్ని విహరించడానికి బయలుదేరాడు. అప్పుడు అతను ఒక ముసలి వ్యక్తిని, రోగంతో బాధపడుతున్న ఒక పీడితున్ని, ఒన సన్యాసిని, కుళ్లిపోతున్న ఒక శవాన్ని చూస్తాడు. అది చూసిన సిద్ధుడి మనసు కలచివేస్తుంది. తన రథసారధి ద్వారా ప్రతి ఒక్క మానవుడికి మరణం సంభవిస్తుందని తెలుసుకుంటాడు. దాంతో అతను మరణాన్ని, రోగాలను, ముసలితనాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాసి జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంటాడు.
అలా నిర్ణయించుకున్న తరువాత ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై ఎక్కి తప్పించుకుంటాడు. తన సన్యాసి జీవితాన్ని మగధ సామ్రాజ్యంలోని రాజగుహ పట్టణంలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. అయితే ఆ రాజ్యానికి రాజు అయిన బింబిసారుడు, సిద్ధార్థుని గురించి, అతని అన్వేషణ గురించి తెలుసుకుని, మహారాజ పదవిని బహూకరిస్తాడు. కానీ సిద్ధార్థుడు ఆ పదవిని చాలా సున్నితంగా తిరస్కరించి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత ఇద్దరు సన్యాసుల దగ్గర శిష్యరికం చేశాడు. వారిలో అలరకలమ అనే సన్యాసి, సిద్ధార్థునిని తన వారసుడిగా వుండమని కోరుకుంటాడు. కానీ అతని బోధనలవల్ల సిద్ధార్థునికి జ్ఞానతృష్ణ తీరకపోవడంతో ఆ కోరికను నిరాకరిస్తాడు. తరువాత ఉదకరామపుత్ర అనే యోగి దగ్గరకు వెళ్లి, యోగశాస్త్రాన్ని అభ్యసించాడు. ఆ యోగి కూడా తన వారసత్వాన్ని పుచ్చుకోమని కోరుకుంటే.. దానిని కూడా తిరస్కరించి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇలా బౌద్ధుడు తన జ్ఞానతృష్ణను తీర్చుకోవడానికి రకరకాల యోగుల దగ్గర శిష్యరికాన్ని నిర్వర్తించాడు. అలాగే ఒకనాడు కౌండిన్యుడు అనే యోగి దగ్గర మరో ఐదుగురి వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా జ్ఞానాన్ని పొందడం కోసం ఎటువంటి ఆహార పదార్థాలను సేవించకుండా సాధన చేసేవారు. సిద్ధార్థుడు కూడా వీరి బాటలోనే వ్రతాలను ఆచరిస్తూ, కేవలం ఒక గింజను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. దాంతో అతని శరీరం ఎంతగానో క్షీణించిపోయింది. ఒకనాడు నదిలో స్నానం ఆచరిస్తుండుగా.. బుద్ధుడు కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పటి తను ఎంచుకున్న మార్గం సరైనది కాదని వ్రతాలను ఆచరించడం మానేశాడు.
జ్ఞానోదయం కలగడం :
ఒకనాడు సిద్ధార్థుడు ఉశ్చ్వాస, నిశ్వాసలు (ధ్యానం) ద్వారా సుఖాలను, కోరికలను త్యాగం చేయడం తెలుసుకున్నాడు. తరువాత బుద్ధుడు పరమ సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఒక బోధి వృక్ష నీడలో భగవత్ ధ్యానం చేయడం ఆరంభించాడు. అలా చివరకు అతని 35వ ఏట, 49 రోజులవరకు ధ్యానం చేసిన తరువాత జ్ఞానోదయం కలిగింది. కానీ కొందరు మాత్రం సిద్ధార్థునికి భాద్రపదమాసంలో జ్ఞానోదయం అయిందని చెబితే.. మరికొందరు మాత్రం పాల్గుణ మాసంలో జ్ఞానోదయం అయిందని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలా జ్ఞానోదయం అయిన తరువాత సిద్ధార్థుడు, గౌతమ బుద్ధునిగా మారిపోయాడు.
ఆ జ్ఞానంతోనే బుద్ధుడు.. మానివుని అజ్ఞానానికి, కష్టాలకు గల కారణాలు.. వాటి నుంచి విముక్తి పొందే మార్గాలను తెలుసుకోగలిగాడు. వాటినే 4 పరమ సత్యాలుగా విభజించి, ప్రతి బుద్ధునికి వుండాల్సిన లక్షణాలను పేర్కొన్నాడు.
బౌద్ధ మత ప్రచారం :
బుద్ధుడు మొదట తపుస్సా, భల్లనే అనే ఇద్దరు వర్తకులను తన శిష్యులుగా నియమించుకుని, తన తల నుంచి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడు. అవి ఇప్పటికీ రంగూల్ లోని ష్యూడాగన్ ఆలయంలో వున్నాయి. తరువాత కౌండిన్యుని దగ్గర తనతోపాటు శిష్యరికం చేసినవారికి తను తెలుసుకున్న పరమసత్యంపై ఉపన్యాసం ఇచ్చాడు. అప్పుడు వారంతా కలుసుకుని మొదటి బౌద్ధ భిక్షవుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తరువాత ఈ సంఘాల సంఖ్య కాలక్రమంలో పెరుగుతూ, బౌద్ధ మత ప్రచారం కోసం ప్రపంచమంతా పర్యటించారు.
బుద్ధుని మరణం :
మహా పరనిభాన సూక్తం ప్రకారం... గౌతమ బుద్ధుడు తన 80వ ఏట.. ‘‘నేను కొద్దిరోజులలో నిర్యాణ పొందుతాను’’ అని ప్రకటించుకున్నాడు. అప్పుడు కుంద అనే కమ్మరి సమర్పించిన ఆహారాన్ని బుద్ధుడు భుజించడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు బుద్ధుని శిష్యులు బౌద్ధ బిక్షవులందరిని పిలిపించారు. అప్పుడే బుద్ధుడు నిర్యాణమొందాడు.
గౌతమ బుద్ధునికి అంత్యక్రియలు నిర్వహించిన తరువాత అతని అస్థికలను వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు. ఉదాహరణకు శ్రీలంకలో వున్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపున వుండే పన్ను ఇప్పటికి భద్రపరిచి వుంది. దానినే టెంపుల్ ఆఫ్ టూత్ అని అంటారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more