ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు మణివణ్ణన్ ఇక లేరు. 59 ఏళ్ల మణివన్నన్ శనివారం గుండెపోటుతో మరణించారు. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటుడిగా, 50కిపైగా చిత్రాలకు దర్శకుడిగా పని చేసిన మణివన్నన్ సీనియర్ తమిళ సినీ ప్రముఖుల్లో ఒకరు. మణివణ్ణన్ కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాలేదు. తెలుగు, మళయాలం, హిందీ సినిమాల్లో కూడా నటించారు. మణివన్నన్ దర్శకత్వంలో చివరగా సత్యరాజ్ ప్రధాన పాత్రలో ‘నాగరాజ చోలన్ ఎంఏ, ఎంఎల్ఏ' అనే తమిళ చిత్రం విడుదలైంది. మే 10, 2013లో విడుదలైన ఈ చిత్రంలో ఆయన ఓ పాత్ర కూడా పోషించారు.
1954లో కోయంబత్తూరు జిల్లా సులూర్ లో జన్మించి ఆర్.మణివణ్ణన్ చెన్నై నెసపక్కంలోని తన నివాసంలో ఈరోజు (15.06.2013) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య సెంగమలం, కుమారుడు రఘువరన్, కుమార్తె జ్యోతి ఉన్నారు. పుదుమనితన్, చిన్నతంబి పెరియా తంబి, పల్లికట్టు వంటి గొప్ప తమిళ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తొలుత మాటల రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నటుడు, దర్శకుడుగా మారారు.తెలుగులో నాగబాబు హీరోగా నటించిన అగ్రిమెంట్, కార్తీక్, రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ నటించిన గోపాలరావుగారి అబ్బాయి, సుమన్, విజయశాంతి నటించిన దర్జాదొంగ చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు.
తెలుగులో కుబుసం చిత్రంలో ఆయన నటించారు. మోహన్, నళిని, విజయకాంత్ నటించిన నూరవ రోజు, భానుచందర్, అహల్య నటించిన ఖూనీ, సత్యరాజ్,రాధ నటించిన ఖైది నెం.79 చిత్రాలకు కూడా ఆయన దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషలలో దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ఆయన ఎక్కువ సినిమాలలో హీరోలకు తండ్రిగా, మామగా నటించారు. తండ్రిగా ఆయన నటన అమోఘం. పలు చిత్రాలలో తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని తన నటన ద్వారా చాలా అద్బుతంగా ప్రదర్శించారు. తెలుగు డబ్బింగ్ చిత్రాలు ఒకేఒక్కడు, ప్రేమికులరోజు, రిథం, నరసింహ, శివాజి, భామనే సత్యభామనే చిత్రాల్లో మణివణ్ణన్ నటనను మనం మరచిపోలేం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటతడిపెట్టిస్తారు. ఒకేఒక్కడు, ప్రేమికులరోజు చిత్రాలలో ఆయన నటన చూడవలసిందే. మణివన్నన్ మరణవార్తతో కోలీవుడ్ మొత్తం విషాదంలో మునిగి పోయింది. నటులు సిద్ధార్థ, ప్రియమణి, దర్శకుడు సుందర్ సి తదితరులు ట్విట్టర్లో తమ సంతాపం వ్యక్తం చేసారు. మణివణ్ణన్ మరణ వార్త ఇటు పలువురు తెలుగు సినీ ప్రముఖులను కూడా కలిచి వేసింది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more